logo

వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం

రామకృష్ణాపూర్‌లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్‌పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 03:13 IST

రామకృష్ణాపూర్‌లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్‌పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎండ వేడిమి తాళలేక ఉపశమనం కోసం ఇలా కొబ్బరి బోండం తాగుతూ కనిపించారు.

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే


ప్రచారానికి పయనం.. వాహనంలోనే అల్పాహారం

కారులోనే అల్పాహారం తింటున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అల్పాహారం, భోజనానికి ప్రత్యేకించి సమయం వృథా కాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం ఉట్నూరులోని తన ఇంటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఆమె ఇంట్లో తయారుచేసిన అల్పాహారం, భోజనాన్ని ప్యాక్‌ చేసుకొని వెంట తీసుకెళ్తున్నారు. శనివారం కుమురం భీం జిల్లాలో ప్రచారానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో వాహనంలోనే అల్పాహారం తిన్నారు.    

న్యూస్‌టుడే, ఉట్నూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని