మండే ఎండతో జాగ్రత్త..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ఆరెంజ్ జోన్లో ఉమ్మడి ఆదిలాబాద్
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత, వడగాల్పుల కారణంగా వడదెబ్బ తగిలి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. మరో వారం రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచనలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం సగటు 42.3 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత పెరిగింది. వేసవి ప్రారంభంలో అప్పుడప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం, మధ్యలో వర్షం కురవడంతో వేసవి తీవ్రత అంతగా కనిపించలేదు. రెండ్రోజుల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న అయిదు రోజులపాటు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వేడి తీవ్రత తగ్గిన తర్వాత వెళ్తే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రమాద ఘంటికలు..
- ఆదిలాబాద్ జిల్లాలో ఆరెంజ్ జోన్లో ఉన్న మండలాల్లో అత్యధికంగా బేలలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జైనథ్, భీంపూర్, సిరికొండ, చెప్రాల ప్రాంతాల్లో 43 డిగ్రీలు, మావల, గుడిహత్నూర్, ఆదిలాబాద్, తలమడుగు తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- కుమురం భీం జిల్లాలో రెబ్బెన, తిర్యాణి, పెంచికల్పేట, దహెగాం, కాగజ్నగర్, కెరమెరిలో అత్యధికంగా 44 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ఆసిఫాబాద్, కౌటలలో 43.5 డిగ్రీలుగా నమోదైంది.
- నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కడెం, ఖానాపూర్, నర్సాపూర్, లక్షణచాంద, మామడ, ముథోల్, దిలావర్పూర్ మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్ జోన్గా ప్రకటించారు.
- మంచిర్యాల జిల్లాలో నస్పూర్ ప్రాంతంలో అత్యధికంగా 44.8 డిగ్రీలుగా నమోదైంది. దండేపల్లి, కాసిపేట, చెన్నూర్, జన్నారం, భీమిని, కోటపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలకు పైగా నమోదు కాగా, మంచిర్యాలలో 43 డిగ్రీలుగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం