అవగాహన లేక.. అనుమతి పొందక..!
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు.
వేడుకల్లో యథేచ్ఛగా మద్యం ఏర్పాటు
ఓ ఫంక్షన్హాల్లో మద్యం సీసాలు
న్యూస్టుడే, నిర్మల్ పట్టణం: పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. అందరికీ సౌలభ్యంగా ఉండాలన్న కోరికతో ఖర్చు ఎక్కువైనా ఫంక్షన్హాళ్లను ఉపయోగించుకుంటున్నారు. నోరూరించే భోజనాలు సిద్ధం చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి అక్కడే మద్యం కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఈ కారణంగానే పల్లె, పట్నం తేడాలేకుండా అన్నిచోట్లా ఫంక్షన్హాళ్లు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వేడుక నిర్వాహకుల అవగాహన లేమి, వేదిక యాజమాన్యాల పట్టింపులేనితనం కారణంగా తగిన అనుమతులు లేకుండానే మద్యపానం కొనసాగిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమని చాలామందికి తెలియకపోవడం గమనార్హం.
పట్టించుకోక..
మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఫంక్షన్హాల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం, పేకాట కొనసాగిస్తున్నారు. వచ్చినవారు వాహనాలను ఇష్టారీతిన నిలిపేస్తున్నారు. అర్ధరాత్రులు డీజే చప్పుళ్లతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం సీసాలను దారిలో వదిలేయడం, అపార్ట్మెంట్ వాళ్లతో గొడవపడటం సర్వసాధారణంగా మారాయి. దీనివల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. మీరైనా స్పందించి తగిన న్యాయం చేయండి. అంటూ జిల్లాకేంద్రానికి చెందిన ఓ అపార్ట్మెంట్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.
వేడుక అనగానే చాలామంది విందుతో పాటు మందు (మద్యం) కూడా ఏర్పాటుచేయాలనే భావనతో ఉంటున్నారు. ఈ కారణంగానే ఓ పక్క సిట్టింగ్, మరో పక్క భోజనాలు అనే రీతిలో కొనసాగిస్తున్నారు. వచ్చినవారికి ఇది సౌలభ్యంగానే ఉంటున్నా.. చుట్టుపక్కల వారికి ఆటంకంగా మారుతోంది. పైపెచ్చు.. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆబ్కారీ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఇలా వేడుకల్లో సిట్టింగ్ ఏర్పాటుచేయడం చట్టరీత్యా నేరం. దీనివల్ల వేడుక నిర్వాహకులే కాదు, సంబంధిత ఫంక్షన్హాల్ యాజమాన్యంపైనా కేసు నమోదుచేసేందుకు ఆస్కారముంటుంది. ఈ విషయాలపై యాజమాన్యాలకు అవగాహన ఉన్నా.. అది నిర్వాహకులకు చెప్పటం లేదు. ఫలితంగా చాలామంది ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్ఛగా ఈ తతంగం కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పేకాట సైతం సాగుతోందనే విమర్శలున్నాయి.
రుసుము చెల్లించి..
ఆనందంగా జరుపుకొనే వేడుకల్లో మద్యం ఏర్పాటుచేసే విధానం ఆక్షేపణీయం. తప్పదనుకునే సందర్భంలో అనుమతి పొందాలి. ఏ రోజు వేడుక ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది, మద్యం ఏర్పాటుచేసే విషయాలను తెలియజేస్తూ ఆబ్కారీ అధికారులకు ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. సగటున రూ.10 వేల వరకు ఉండే రుసుమును చెల్లిస్తే తాత్కాలిక అనుమతి జారీ అవుతుంది. దీనివల్ల వేడుక జరిగే సమయంలో అధికారులు తనిఖీ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ అనుమతి లేకపోతే నలుగురిలో నవ్వులపాలవుతాం. అనుకోకుండా ఎవరైనా ఫిర్యాదుచేసినా, అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేసినా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. రూ. లక్షలు ఖర్చుపెట్టి ఎంతో ఆనందంగా జరిపే వేడుకకు ఇలాంటి అనుమతి పొందాలనే విషయంపై అవగాహన లేక పట్టించుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం
వేడుక ఏదైనా వచ్చినవారి సౌలభ్యం కోసం మద్యం ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా అలాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటే అనుమతి తీసుకోవాలి. అదే రోజు దరఖాస్తు చేసుకున్నా అనుమతి జారీచేస్తాం. రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయమై సరైన అవగాహన లేక చాలామంది అనుమతి పొందడం లేదు. కొందరు తీసుకుంటున్నారు. అనుమతి లేకుండా మద్యం ఏర్పాటుచేస్తే తనిఖీల్లో ఈ విషయం బయటపడితే చర్యలు తప్పవు.
రజాక్, ఆబ్కారీ పర్యవేక్షకుడు, నిర్మల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలక ఘట్టం.. ఎవరికో పట్టం..
[ 12-05-2024]
దాదాపుగా రెండు నెలలుగా సాగిన రాజకీయ ప్రచారమంతా ఇప్పుడు ఓటర్ల చుట్టూ కేంద్రీకృతమవుతోంది. కీలక ఘట్టమైన పోలింగ్కు మరో 24 గంటలే మిగిలి ఉంది. -
పోలింగ్కు 1,500 మంది పోలీసులతో బందోబస్తు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
పార్టీలు వేరైనా పాతకాపులమేగా
[ 12-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం మండలంలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కరంజి-టిలో భారాస నాయకులు ఎదురుపడ్డారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
[ 12-05-2024]
అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ముగిసిన ఎన్నికల ప్రచారం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
నిబంధనల ఉల్లంఘన.. యథేచ్ఛగా విక్రయాలు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయ కేంద్రాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఆత్రం సుగుణను గెలిపించండి
[ 12-05-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: గోడం నగేష్
[ 12-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం పొన్నారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్జాదవ్ పేర్కొన్నారు. -
కదులుదాం..తరలుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, నేతలు ఎంతగా ప్రయాసపడ్డారో.. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ప్రజల నిర్ణయం ఎలా ఉందో నిక్షిప్తం చేసేది రేపు.. -
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
[ 12-05-2024]
ప్రేమ వ్యవహారం ఒక యువకుడిని బలిగొనగా, మరొకరు గాయపడేలా చేసింది. ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
మోదీ, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు: వివేక్
[ 12-05-2024]
ప్రధాని మోదీ, భారాస అధినేత కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో ప్రజాపాలన కొనసాగాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్..
[ 12-05-2024]
చెన్నూరు పట్టణంలో భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
రూ. వెయ్యి కోత.. ఎందుకీ తేడా?
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులకు భోజనం, ఇతర వసతుల కల్పన కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.4 వేలు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
[ 12-05-2024]
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజిద్ అలీ సస్పెండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు