logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.

Published : 28 Apr 2024 12:01 IST

ఎదులాపురం :  రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.  పట్టణంలోని ఖిజ్ర మసీదు ఇమామ్ ముఫ్తీ ముస్తఫా అనే వ్యక్తి నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొంతసేపటికి మావల వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ మధ్యలో కింద పడి ఉన్నారు. గమనించిన స్థానికులు ఆయనను 108 వాహనంలో  రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  వాహనం అదుపుతప్పి పడిపోయారా? లేదా ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు