logo

rrrhhhhh: రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ

 సూర్యాపేటలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. 

Published : 28 Apr 2024 18:47 IST

క్రీడావిభాగం: సూర్యాపేటలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. అండర్-18 ఏళ్ల విభాగంలో ఏ.వైష్ణవి 100 మీ.ల పరుగు పోటీల్లో రజతం, మహిళల విభాగంలో ఎన్.అరుణ 400 మీ.ల పరుగు పోటీలో కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారని కోచ్, మేనేజర్లు వి.జి.ఎస్.రాకేష్, సౌమ్య, వి.జి.ఎస్.జ్యోతిశ్వరణ్ తెలిపారు. పతక విజేతలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  అడ్డి భోజరెడ్డి, పి.రాజేష్, పేటా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.పార్థసారథి, ఎన్.స్వామి, ఎస్.జి.ఎఫ్. జిల్లా కార్యదర్శి కాంతారావు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు