పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు
కాగజ్నగర్, న్యూస్టుడే: కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కాగజ్నగర్ పట్టణంలోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి సీహెచ్.శ్వేత(27)కు మొదటి కాన్పులో పురిటి నొప్పులు అధికంగా రావడంతో ఆదివారం ఉదయం పట్టణంలోని పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. పరీక్షలు చేయగా గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్వరమే మృత శిశువును తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా వైద్యులు నిర్లక్ష్యం చేశారు. సాయంత్రం సిజేరియన్ చేసి మృతి చెందిన శిశువును తొలగించారు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించగా మెరుగైన వైద్యం నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. కుటుంబీకులు అంబులెన్సులో ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. కాగజ్నగర్లోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శ్వేత మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆ అంబులెన్సులోనే మృతదేహాన్ని ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందున్న రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్వరమే వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. టౌన్ ఎస్ఐ అంజయ్య ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ముందు జాగ్రత్తగా ఆసుపత్రిని మూసి వేశారు. పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన వినోద్తో శ్వేతకు వివాహమైంది. ప్రస్తుతం ఆ దంపతులు కాగజ్నగర్లోనే నివాసముంటున్నారు. శ్వేత మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెల్లవారుజామున స్ట్రాంగ్రూంలకు సీల్
[ 15-05-2024]
పోలింగ్ రాత్రి వరకు కొనసాగడంతో ఈవీఎంలను ఆదిలాబాద్లోని స్ట్రాంగ్రూంలకు తరలించేందుకు అర్ధరాత్రి దాటింది. సామగ్రిని అప్పజెప్పడం మొదలుకుని, ప్రతి ఈవీఎంకు సీల్ వేసింది.. లేనిది పరిశీలించుకున్నాకే స్ట్రాంగ్రూంలలో వాటిని భద్రపరిచారు. -
గెలుపు మనదే..!
[ 15-05-2024]
పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భారాసలో అంతర్మథనం జరుగుతోంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 74,03 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. -
పల్లెప్రజల హవా.. పట్టణవాసులు డీలా!
[ 15-05-2024]
నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లు సోమవారం జరిగిన ఎన్నికల్లో చైతన్యం ప్రదర్శించగా.. విద్యావంతులు అత్యధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లలో కొంత నిరాసక్తత కనిపించింది. -
భాజపా విజయం ఖాయం
[ 15-05-2024]
దేశం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలన్న ఓటర్ల సంకల్పం చూస్తుంటే ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. -
అందని డబ్బులు.. ఆందోళనలో అన్నదాతలు
[ 15-05-2024]
తపాలాశాఖలోని ఐపీపీబీ (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు)లో జరిగిన అక్రమాల కేసులో బాధితులుగా ఉన్న రైతన్నలు 74 మందికి చెందిన డబ్బులు వారికి చేతికి అందకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. -
‘ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కులమతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రగిలించి ఓట్లు దండుకోవాలని చూసిన మతతత్వ భాజపాకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణలు విమర్శించారు. -
భారం తొలగింది.. ఫలితం మిగిలింది..
[ 15-05-2024]
గత కొంత కాలంగా ప్రచారం, సభలు, సమావేశాలంటూ పార్లమెంటు ఎన్నికల సంరంభంలో తలమునకలైన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఆ బరువు దించుకున్నారు. -
‘ఆదర్శ’లో ఇంటర్ ప్రవేశాలకు అవకాశం
[ 15-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడింది. పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఇంటర్లో ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తున్నారు. -
స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం
[ 15-05-2024]
గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో పోలింగ్శాతం స్వల్పంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ తమకు ఏ మేరకు కలిసివస్తుందోనని.. పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్లతో నేతలు లెక్కలు తీస్తున్నారు. -
సరిహద్దులో.. తగ్గుదల!
[ 15-05-2024]
జిల్లాలోని పలు మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. వాటిలోని పోలింగ్ కేంద్రాల్లో శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. -
అనుమతుల్లేవంటారు.. తరలిస్తున్నా చూడరు!
[ 15-05-2024]
అసైన్డ్ భూములు, పంట పొలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా మొరం తరలించడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. అక్రమార్కులు మట్టిని తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. -
మంత్రి సీతక్కపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 15-05-2024]
జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఓటర్లను ప్రలోభపెట్టిన విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. -
నీటి కుంట.. తీరేను తంటా!
[ 15-05-2024]
అడవుల నరికివేత కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని, నీటి వనరులు కనుమరుగై కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో మానవజాతే కాకుండా జంతువులు, పశుపక్ష్యాదులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. -
నారీ శక్తి.. పోలింగ్పై ఆసక్తి
[ 15-05-2024]
ఎక్కడా ఎలాంటి సభ జరిగినా దాన్ని విజయవంతం చేసేది మహిళలే. పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తామున్నామంటూ వారే ముందువరుసలో ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లెక్కచేయకుండా.. -
వీరికి దారి సమస్యే ప్రధానం
[ 15-05-2024]
మైదాన ప్రాంతాల్లో చిన్న తారురోడ్డు రెండు వరుసలవుతోంది. రెండు వరుసల దారి మరింత వెడల్పవుతోంది. కానీ మారుమూలన ఉన్న గిరిజన గ్రామాలకు కనీసం అత్యవసరవేళ అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితుల్లో దారులున్నాయి. -
ప్రభావితంలో ఓటు ప్రశాంతం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా సరిహద్దుకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య తరచూ ఎదురుకాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. -
లెక్కింపునకు పటిష్ఠ చర్యలు
[ 15-05-2024]
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. -
దొంగతనాల కాలం.. జరపైలం..
[ 15-05-2024]
‘ఈనెల 11న గద్దెరాగడిలోని ఆర్ఆర్నగర్లో నివాసం ఉంటున్న ఓ సింగరేణి కార్మికుడితో పాటు ఓ వైద్యుడు ఊళ్లకు వెళ్లారు. ఇంట్లో మూడు, నాలుగు రోజులు ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇళ్లలోకి చొరబడి రూ. 20వేలతో పాటు 9 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.’
తాజా వార్తలు (Latest News)
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో