logo

కార్మికుల హక్కుల సాధనకు మతోన్మాదులను ఓడించాలి

కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు.

Updated : 29 Apr 2024 15:35 IST

ఎదులాపురం: కార్మికుల హక్కులను కాలరాసే యత్నాలు చేస్తున్న మతోన్మాద పార్టీలను ఓడించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరు ఏకమై మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. మే డేను కార్మికులు పారిశ్రామిక కేంద్రాల్లో, వాడవాడలో ఘనంగా నిర్వహించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని