logo

మే డే గోడ ప్రతులను ఆవిష్కరించిన ఏఐటీయూసీ నేతలు

జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.

Published : 29 Apr 2024 16:48 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఏఐటీయూసీ నేతలు ప్రపంచ కార్మిక దినోత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ మాట్లాడుతూ.. రానున్న మే 1న నిర్వహించే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నేతాజీ కూడలి వద్ద నిర్వహించే బహిరంగ సభకు కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజు, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్రోజ్, కార్మికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని