ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
శిక్షణలో పాల్గొన్న వైద్యాధికారులు
ఆదిలాబాద్ వైద్య విభాగం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 144 కేంద్రాల్లో ప్రత్యేక సేవలను అందించటానికి ఆయా కేంద్రాల వైద్యాధికారులకు ఇది వరకే శిక్షణ సైతం అందించారు. ప్రత్యేక వైద్య నిపుణులతో వారందరికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఎన్నికలు పూర్తవటంతో అతి త్వరలో ఆ సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తే బాధితులు సుదూరంలో ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వారికి వ్యయప్రయాసలు తప్పనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో మూడో వంతు కేంద్రాల్లో అదనంగా ఏడు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో 59 పీహెచ్సీలు, 13 యూపీహెచ్సీలు, ఎనిమిది బస్తీ దవాఖానాలు, 64 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో మాతా, శిశు సంరక్షణ, టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నియంత్రణ, సాధారణ వ్యాధులకు చికిత్సలను అందజేస్తున్నారు. నేషనల్ ప్రోగ్రాం నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్లో భాగంగా ఇక నుంచి ఉమ్మడి జిల్లాలోని 144 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలను సైతం అందించనున్నారు. ఈ నెల మూడో వారం నుంచి వాటిని అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇది వరకు అందిస్తున్న అయిదు సేవలకు ఇవి అదనం.
ప్రత్యేక సేవలు ఇవే..
ఈఎన్టీ, ఆప్తాలమిక్, డెంటల్, మానసిక, పాలియేటివ్కేర్, 65 సంవత్సరాల వయసు దాటిన వారికి ఎల్డర్లీ హెల్త్ కేర్, ఎన్సీడీ సేవలు మొదటి విడతలో ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలపై ఆయా కేంద్రాల వైద్యాధికారులకు అవగాహన లేకపోవటంతో ప్రత్యేక వైద్య నిపుణులతో శిక్షణను పూర్తి చేశారు. ఆ సేవలు ఎలా అందించాలో వారికి ప్రత్యేక వైద్య నిపుణులు రిమ్స్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. రెండో విడతలో కొన్ని, మూడో విడతలో మరికొన్ని కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని వైద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు.
పెద్దాసుపత్రులకు వెళ్లనక్కర లేదు
రాఠోడ్ నరేందర్, డీఎంహెచ్ఓ
ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నికల అనంతరం ఏడు రకాల ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇప్పటికే అయిదు రకాల సేవలందిస్తున్నాం. ప్రత్యేక సేవలను కలుపుకొని ఆరోగ్య కేంద్రాల్లో పన్నెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. బాధితులు సుదూరంలోని పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరదతో పొంచి ఉన్న ముప్పు
[ 01-06-2024]
వర్షాకాలంలో లోతట్టు కాలనీవాసుల కష్టాలు వర్ణనాతీతం. వరద నీరు ఇళ్లను ముంచితే బంధువుల ఇంటికో లేక బల్దియా యంత్రాంగం ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రానికో వెళ్లాల్సిన పరిస్థితి. -
రోడ్డు కాదు పెనం.. జంకుతున్న జనం
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
జన చేతనం.. జయ కేతనం
[ 01-06-2024]
చిన్నా పెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులంటూ లింగభేదం లేదు. ఆటలాడే చిన్నారి నుంచి పండు ముసలి వరకు ఒకటే నినాదం.. జై తెలంగాణ. స్వరాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరుముందుకు కదిలి పిడికిలి బిగించి ముందుకు సాగిన ఆ రోజులు ఎటుచూసినా ఆందోళనలతో అట్టుడికింది. -
సంపూర్ణ పోషణ.. పాలతో సాద్యం
[ 01-06-2024]
పంటలతో పాటు పాడి పెంపకంపై రైతులు దృష్టి సారిస్తే.. అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పిల్లలకు పోషకాలు అందించేందుకు అవకాశం ఉంది. పాడి పోషణ రైతులకు భారం అవుతుండటంతో చాలా మంది రైతులు వాటికి దూరమవుతున్నారు. -
బాసర అమ్మవారి సన్నిధిలో అందెశ్రీ
[ 01-06-2024]
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. -
ప్రారంభించకుండానే శిథిలం
[ 01-06-2024]
పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఎవరికీ అక్కరకు రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. -
నిర్వహణ భారం.. నీరుగారుతున్న లక్ష్యం
[ 01-06-2024]
వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో అన్నదాతలు సమావేశమై పంటల సాగు, సమస్యలపై వ్యవసాయ అధికారులతో చర్చించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి నిర్వహణ, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. -
ఇంటర్ ఇక్కట్లు
[ 01-06-2024]
పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించి ముందుకు సాగుతుంటారు. జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉంటే ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. -
కనిపించని ‘పొనికి’ ఉనికి
[ 01-06-2024]
పొనికి కర్ర అరుదైనది. అలంకరణ వస్తువులతోపాటు అందమైన బొమ్మలు, ఇతర కళాకృతుల తయారీకి దీన్ని విరివిగా వినియోగిస్తారు. నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ దీనిపైనే ఆధారపడి కొనసాగుతోంది. స్థానికంగా కర్ర లభించక పరిశ్రమ నిర్వాహకులు ఇతరప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. -
పారదర్శకత కోసం పొదుపు పద్దు పరిశీలన
[ 01-06-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేలా కార్యాచరణ చేపట్టింది. -
పట్టణ చెరువుల పరిరక్షణకు అడుగులు
[ 01-06-2024]
పట్ణణాల్లో జల వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురపాలికల్లో చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
[ 01-06-2024]
జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ఓ భూవివాదం కేసులో దాసరి నరేష్ అనే వ్యక్తి ఈనెల 19న తాడూరి పోశం, తూము మోహన్లపై ఫిర్యాదు చేశారు. -
శునకం.. చూపిస్తుంది నరకం
[ 01-06-2024]
శునకాల దాడులు జిల్లాలో తీవ్రమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట వీటి దాడులతో గాయపడుతున్న వారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. నిత్యం సర్కారు ఆసుపత్రి బాట పడుతున్నారు. -
అమ్మమ్మ ఇంటికొచ్చి.. అరగంటలో దోచేసి
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికొచ్చింది.. వారింట్లో ఉన్న బంగారం, నగదుపై ఆమె కన్నేసింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్ని తన ప్రియుడిని రప్పించింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అరగంటలో బంగారం, వెండి, నగదు కాజేశారు.