logo

కాంగ్రెస్‌కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!

హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.

Published : 30 Apr 2024 03:11 IST

మాలేబోరిగాంలో ఓటు అభ్యర్థిస్తున్న భారాస అభ్యర్థి ఆత్రం సక్కు, చిత్రంలో రామన్న

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మాలేబోరిగాం, చిన్న మాలేబోరిగాం, కేబీకాలనీ, దర్మగూడ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. భారాస ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందన్నారు.  కాంగ్రెస్‌, భాజపాలను నమ్మొద్దన్నారు. ఎంపీపీ గండ్రత్‌ రమేష్‌, నాయకులు ఆర్‌.రమేష్‌, సెవ్వా జగదీశ్‌, కుమ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని