logo

భాజపా విధానాలను వ్యతిరేకించాలి

కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 16:03 IST

ఎదులాపురం: కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం మేడే వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ కార్మిక వర్గానికి అన్యాయం చేయడం సరికాదన్నారు. నేతలు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని