గిరిజన గ్రామాల్లో కూటమి విస్తృత ప్రచారం
డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.
తూటంగిలో ఇంటింటికి కరపత్రాలతో
డుంబ్రిగుడ, న్యూస్టుడే: డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు ఆధ్వర్యాన తూటంగి, లైగండ, గుంటసీమ, అరమ పంచాయతీల పరిధి గిరిజన గ్రామాల్లో ఇంటింటి కెళ్లి ప్రచారం చేశారు. అరకు పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల, న్యూస్టుడే: తెదేపా వస్తేనే గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ పద్మ తెలిపారు. జి.మాడుగుల మండలం బొయితిలి, కిల్లంకోట పంచాయతీల్లో తెదేపా నాయకులతో కలిసి పర్యటించారు. కూటమి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులు నాగబ్బాయి, రామకృష్ణ, జనసేన నాయకుడు సింహాచలం పాల్గొన్నారు.
చింతూరు, న్యూస్టుడే: చింతూరు మండలంలోని రామన్నపాలెం, పెద్దసీతనపల్లి పంచాయితీల్లో కూటమి అభ్యర్థులైన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిల గెలుపు కోసం కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను గూర్చి వివరించారు. మూడు పార్టీల మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, చిట్టిబాబు, మడివి రాజు, నాయకులు రవి, శీలం తమ్మయ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
బొయితిలిలో ప్రచారాన్ని చేస్తున్న ఎంపీపీ పద్మ, కూటమి నాయకులు
సంతలో ఎన్నికల సందడి
ఐక్యంగా కదిలిన ఎన్డీఏ నేతలు
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో ఎన్నికల సందడితో నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు నిర్వహించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావులను గెలిపించాలని కూటమి నాయకులు ప్రచారం చేశారు. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధర్స్వామిని గెలిపించాలని ఇండియా కూటమి నాయకులు, స్వాతంత్ర అభ్యర్థి సీవేరి అబ్రహాంలను గెలిపించాలని వారి అనుచరులు ప్రచారాలు నిర్వహించారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి, అనుమతులను పరిశీలించారు. గ్రామాల్లో ఇటుకల పండగ జరుగుతుండటంతో సంతలో జనసందోహాం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.