గిరిజన సంక్షేమానికి వైకాపా తూట్లు
గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
రంపచోడవరం, గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. విద్య, వైద్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్వయం ఉపాధిపై ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమాన్ని మొత్తంగా గాలికొదిలేసింది. సంక్షేమంతోపాటు వారి హక్కులు సైతం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం స్వయం ఉపాధికి ట్రైకార్ పథకం ద్వారా అందజేసిన వాహనాలు, టెంట్హౌస్ తదితర యూనిట్లను పూర్తిగా నిలిపివేశారు. గిరిజనుల యువకులకు ఈ నిర్ణయం శాపంగా మారింది. ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.3 పునరుద్ధరణకు అవసరమైన చర్యలు లేవు. ప్రత్యేక నియామకాలు ఊసేలేదు. మొత్తంగా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమంపై నీళ్లు చల్లినట్టయింది.
గిరిజనుల సంక్షేమానికి రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యాలయం
నిర్వీర్యమైన ట్రైకార్
గతంలో ట్రైకార్ పథకం ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు వివిధ యూనిట్లను మంజూరు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడంతో స్వయం ఉపాధి దూరమైంది. ఆర్థికంగా గిరిజన యువత ఇబ్బంది పడుతున్నారు. -కంగల శ్రీనివాస్, ఆదివాసీ నాయకులు, రంపచోడవరం
జీవో నంబరు 3కి తూట్లు
గత ప్రభుత్వంలో మన్యంలో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేవారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం జీవో నంబరు 3 పునరుద్ధరించేందకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. స్థానిక గిరిజనులకు కాకుండా మైదాన, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు.
కడబాల రాంబాబు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు, రంపచోడవరం
ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యం
ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్లు గడుస్తున్నా నేటికి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీరు, వైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ ప్రాంతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.
బి.మంగిరెడ్డి, ఆదివాసీ నాయకులు, రంపచోడవరం
గిరిజనుల భవిష్యత్తు అగమ్యగోచరం
ప్రభుత్వం గిరిజనుల హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేయడం వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జీవో నం 3 రద్దవ్వడంతో ఉద్యోగాలు రావడం లేదు. ఎస్టీ జాబితాలో బెంతు ఒరియాలను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఇంకా పోటీ పెరుగుతుంది. అసలైన గిరిజనుల భవిష్యత్తు నాశనం అవుతుంది.
ముర్ల వెంకటరమణ, గిరిజన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు, చింతపల్లి
పీసా, 1/70 చట్టాల అమలేది?
గిరిజన ప్రాంతంలో పీసా, 1/70 చట్టాలు అమలు చేయడం లేదు. వైకాపా నాయకులకు గనులు, ఖనిజాలు అప్పగించడానికి ఈ చట్టాలను తుంగలో తొక్కారు. ఫలితంగా గనులు తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. గిరిజనేతరులు దర్జాగా మన్యంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.
మడపల సోమేష్కుమార్, మన్యపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు, రింతాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.