ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు.
గంగవరం పోర్టు కార్మికులతో ఫలించని చర్చలు!
అరకొరగానే ప్లాంటుకు కోకింగ్ కోల్
ఈనాడు-విశాఖపట్నం: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు. మరో వైపు కార్మికులతో చర్చించి పరిష్కార మార్గాలు కనుక్కోండి అంటూ ‘అదానీ గంగవరం పోర్టు’ యాజమాన్యానికి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆందోళనలో పోర్టులో కార్యకలాపాలు నిలిచి స్టీలు ప్లాంటుకు చెందిన కోకింగ్ కోల్ సరఫరా ఆగిపోయింది. ఫలితంగా రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు నిలిపివేశారు. ముడిసరకు కొరత తీవ్రమవడంతో విశాఖ ఉక్కు మూసివేత దశకు చేరుకుంది. ప్రస్తుతం 700 మంది పోర్టు కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు శనివారం సాయంత్రం వరకు కొలిక్కి రాలేదు. పోర్టులో రెగ్యులర్ ఉద్యోగులు సైతం జీతభత్యాలపై అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రకాలు: స్టీలు ప్లాంటులో ఉత్పత్తి ప్రక్రియకు మూడు రకాల కోకింగ్ కోల్స్ను వాడతారు. హార్డ్ కోకింగ్ కోల్ (30%), సాఫ్ట్ కోల్ (35%) మిగిలింది మీడియం కోకింగ్ కోల్. అన్ని కోల్స్ అందుబాటులో ఉంటే, అందులో రోజు ఒక రేక్ హార్డ్ కోకింగ్ కోల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ రకం కోల్ ఆస్ట్రేలియా నుంచి నౌకలో వచ్చి గంగవరం పోర్టులోనే నిలిచిపోయింది. ఒక నౌకను విశాఖ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ప్లాంటుకు ముడిసరకు సరఫరా చేస్తున్నారు. అయితే అది సాఫ్ట్ కోకింగ్ కోల్ కావడంతో హార్డ్ కోల్ కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. మూడు పోర్టుల నుంచి అరకొరగా ముడిసరకు తెప్పించుకుని ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ నిర్వహిస్తూ రోజుకు 4వేల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు.
పోర్టు కార్మికులు సమ్మె చేపట్టి శనివారానికి 19 రోజులు కావస్తున్నా, విశాఖ ఉక్కుకు ఈ నెల 15 నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గత పదమూడు రోజులుగా 1.40లక్షల టన్నుల ఉత్పత్తిని విశాఖ ప్లాంటు కోల్పోయింది. మార్కెట్లో టన్ను రూ.60వేలు ఉంది. ఈ లెక్కన సుమారు రూ.840కోట్ల ఉత్పత్తులకు ఆటంకం ఏర్పడింది. దీంతో బయట మార్కెట్లో స్టీలు అమ్మకాల్లేక డబ్బులు సమకూరడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.