మన్యాన్ని గంజాయివనంగా మార్చిన జగన్
ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం
అభ్యర్థి గంగాధరస్వామిని పరిచయం చేస్తున్న షర్మిల
పాడేరు/పట్టణం, అరకులోయ, న్యూస్టుడే: ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం ఆమె పాడేరు, అరకులోయల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో గిరిజనులకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 2019లో పాడేరులో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. సామాజిక పింఛన్ల అర్హులకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. అరకు పార్లమెంట్కు పోటీ చేస్తున్న అప్పలనర్స (సీపీఎం), పాడేరు నియోజకవర్గ అభ్యర్థి బుల్లిబాబు (కాంగ్రెస్) మాట్లాడుతూ.. తమను గెలిపిస్తే గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అరకులోయ రోడ్లో జరిగిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఓటర్లు ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని కోరారు. అరకులోయ ఎమ్మెల్యే దోపిడీదారని ఆరోపించారు. మీ కోసం కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. అరకులోయ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శెట్టి గంగాధరస్వామిని, ఎంపీగా అప్పలనర్సను గెలిపించాలని కోరారు. గిరిజన ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారని గంగాధరస్వామి ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు ఉమామహేశ్వరరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు