కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది,
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, గొడుగులమెట్ట, చౌడురాయి, కోటకొండ, గాలిపాడు, కొత్తూరుబయలు తదితర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పరిపాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి జాడ కనిపించలేదని విమర్శించారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 వసూలు చేశారని, ధరలు పెంచి దోచేశారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు. లోతుగెడ్డ సర్పంచి చింతర్ల సునీల్, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు ఆధ్వర్యంలో చౌడురాయిలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. తెదేపా నేతలు రాజమండ్రి నారాయణరావు, పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, గంగరాజు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతివలే ముందుండి నడిపారు!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. -
నేడు పుష్ప-2 చిత్రీకరణ..!
[ 15-05-2024]
పొల్లూరు గ్రామంలోని శివాలయం ప్రాంతంలో పుష్ప-2 సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. -
ఈవీఎంలకు మూడంచెల భద్రత
[ 15-05-2024]
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించిన ఈవీఎంలను మూడంచెల భద్రతతో నిల్వ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు. -
పెరిగిన ఓటింగ్.. కూటమిలో జోష్
[ 15-05-2024]
అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కాదు. అయినా ఓటర్లు ఎటు మొగ్గారో అంచనా వేయడానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. -
అంబులెన్స్లో గిరి మహిళ ప్రసవం
[ 15-05-2024]
మండలంలోని గసభ పంచాయతీకి చెందిన ఓ గర్భిణి అంబులెన్స్లో ప్రసవించింది. మొగిరిగుడ గ్రామానికి చెందిన పాంగి సుమిత్రకు సోమవారం రాత్రి నుంచి పురిటి నొప్పులు మొదలయ్యాయి. -
అర్ధరాత్రి దాటాకా పోలింగ్
[ 15-05-2024]
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రవరం, సోమలింగపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. -
నిరంతర నిఘా కొనసాగిస్తాం
[ 15-05-2024]
అనకాపల్లిలోని జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కగా ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంకు మూడంచెల పోలీస్ బలగాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
ఉదయం వరకు ఈవీఎంల రాక
[ 15-05-2024]
జిల్లాలో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నిర్విరామంగా సాగింది. -
ఈదురుగాలుల వల్లే విద్యుత్తు సరఫరాకు అంతరాయం
[ 15-05-2024]
ఈదురు గాలులు వల్లే భోగాపురం పోలింగ్ కేంద్రానికి సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. -
ఉద్యోగుల పేరిట కుటుంబ సభ్యులకు వేతనాలు 19 నెలల్లో రూ.3.26 కోట్ల స్వాహా
[ 15-05-2024]
యశోదా ఆసుపత్రి గ్రూపులో కీలక విభాగంలో పనిచేసిన ఉద్యోగి రూ. 3.26 కోట్ల పక్కదారి పట్టించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!