పెంచమంటే...తుంచుతారా
జిల్లాలోని మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్మెంట్ తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు
పీఆర్సీపై భగ్గుమన్న ఉద్యోగులు
మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లలో బైఠాయింపు
ఈనాడు, అమరావతి - మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
జిల్లాలోని మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్మెంట్ తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫ్యాప్టో, జాక్టో పిలుపు మేరకు మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి, అన్ని మండలాల్లో నిరసనలు హోరెత్తాయి. ప్రధానంగా మచిలీపట్నానికి వచ్చే దారులన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయాయి. ప్రతి మండలం నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు రకరకాల మార్గాల్లో.. మచిలీపట్నం చేరుకున్నారు. ప్రతి మండలంలో పోలీసులు అడ్డుకుంటున్నా, బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నా.. వారిని దాటుకుంటూ జిల్లా కేంద్రానికి వేలాది మంది చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో అత్యధికశాతం మంది విధులకు గైర్హాజరై.. కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్లారు. మచిలీపట్నం నగరం మొత్తం పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో బారికేడ్ల ముందే బైఠాయించి ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నగరం మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విజయవాడ సహా పలు మండలాల్లో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసనను తెలియజేశారు.మచిలీపట్నం కలెక్టరేట్ చుట్టుపక్కల వలయంలా పోలీసులు మోహరించి లోపల ఉన్నవాళ్లు బయటకు రాకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి పంపించారు. దీంతో పలువురు సిబ్బంది తమ విభాగాలకు చెందిన అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగుల విషయంలో కలెక్టర్ బంగ్లా గేటు వైపు విధులు నిర్వహిస్తున్న ఒక ఎస్సై అమర్యాదగా వ్యవహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై వ్యవహారశైలిపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.
జిల్లాలో పలుచోట్ల నిరసనలు
జగ్గయ్యపేట మండలం, పామర్రు నుంచి చలో కలెక్టరేట్ ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ● విజయవాడ ఆర్అండ్బి కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు.
న్యాయం చేయాలని వేడుకుంటూ నినాదాలు చేస్తున్న మహిళా ఉద్యోగినులు
నివేదికను బహిర్గతం చేయాలి..
అశుతోష్మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి. కేంద్రం అమలు చేస్తున్న పే కమిటీ స్కేల్ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. రాష్ట్ర పే కమిషన్ను యథాతథంగా అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఫింఛనుదారులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించే పీఆర్సీ జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలి. సీపీఎస్ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలి. - చేబ్రోలు శరత్చంద్ర, ఫ్యాప్టో రాష్ట్ర ప్రధానకార్యదర్శి
ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం..
పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లు కావాలని ఎవరూ అడగలేదు. ఇప్పటివరకు ఉన్న 60 ఏళ్ల వయసునే కొనసాగించడంతోపాటు అన్ని డిమాండ్లు పరిష్కరించాలి. న్యాయపరమైన హక్కుల సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో పోలీసులను ప్రయోగించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు వేల సంఖ్యలో ఉపాధ్యాయ, ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. - కొమ్ము ప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం మోసం చేసింది..
ఉపాధ్యాయ, ఉద్యోగులు అందరినీ ప్రభుత్వం మోసం చేసింది. న్యాయబద్ధంగా అడిగిన పీఆర్సీ ఇవ్వకుండా, హక్కుల సాధనకు నిరసన తెలియజేస్తుంటే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎస్ రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నింటినీ తక్షణం ఉపసంహరించుకోవాలి. అప్పుడు మాత్రమే చర్చలకు వెళ్తాం. 27శాతానికి మించి పీఆర్సీ ఇవ్వాలి, పాతహెచ్ఆర్ఏ స్లాబులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. - ఎన్.వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
చీకటి జీవోలు రద్దయ్యే వరకు పోరాటం..
ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలు రద్దయ్యేవరకు ఉద్యమం ఆగదు. మా డిమాండ్ పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. జులై 2019 నుంచి మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్ 27శాతాన్ని రికవరీ చేస్తామని చెప్పడం దారుణం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పునరాలోచన చేయాలి. - తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అరెస్టులతో అడ్డుకోలేరు..
ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులు, సచివాలయ సిబ్బంది.. అందరికీ నష్టమే. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీని 10ఏళ్లకు చేసే ఆలోచన విరమించుకోవాలి. అశుతోష్మిశ్రా ఇచ్చిన నివేదికను బయటపెట్టాలి. అధికారుల ప్రతిపాదనలను రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోల వల్ల ఉపయోగం లేదు. - మద్ది బాబూరాజేంద్రప్రసాద్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బందోబస్తు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ద్విచక్రవాహనంపై మచిలీపట్నంలో పర్యటించి బందోబస్తును పరిశీలించడంతోపాటు డీఎస్పీ మాసుంబాషా, ఎస్బి డీఎస్పీ ధర్మేంద్ర తదితరులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టరేట్, పరాసుపేట, జిల్లాపరిషత్, లక్ష్మీటాకీస్ కూడళ్లలో పర్యటించారు.జిల్లా వ్యాప్తంగా 1200మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించడంతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోనే 300మందికి పైగా బందోబస్తు విధులు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పెడన పోలీసు స్టేషన్కు తరలింపు
పెడన, న్యూస్టుడే: ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (ఫ్యాప్టో) మచిలీపట్నంలో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా గురువారం వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో స్టేషన్లు నిండిపోవటంతో సమీపంలోని పెడనకు కొంత మందిని తరలించారు. పెడనకు తీసుకొచ్చిన ఉపాధ్యాయులను మధ్యాహ్నం నుంచి పంపించి వేశారు. మొత్తం 15 మందిని పెడన పోలీసు స్టేషన్లో ఉంచామని ఎస్సై టి.మురళి చెప్పారు.
ఉపాధ్యాయుడిని లాగేస్తున్న పోలీసులు
ఆందోళన చేస్తున్న వారిని వ్యానులోకి ఎక్కిస్తూ..
మచిలీపట్నం లక్ష్మీటాకీసు కూడలిలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
[ 03-05-2024]
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
సైకిలెక్కిన సర్పంచి.. సొంతూరులో వంశీకి షాక్
[ 03-05-2024]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వగ్రామం ఉంగుటూరు వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్ గురువారం తెదేపాలో చేరారు. -
వికృత క్రీడతో.. విల‘పింఛెను’
[ 03-05-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ఆడిన జగన్నాటకానికి పింఛనుదారులు నరకం చవిచూశారు. వైకాపా అరాచకం.. ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కిట్టూ దర్శకత్వం.. నీలిమూకల అరాచకం!
[ 03-05-2024]
వైకాపా యువనేత, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టూ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు ఎదురేముంది అన్నట్లు అనుచరులను ప్రోత్సహిస్తూ.. పట్టపగలే దాడులకు ఉసిగొల్పుతున్నారు. -
గుడివాడ, అవనిగడ్డలో పవన్కల్యాణ్ పర్యటన రేపు
[ 03-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కట్టలు బలహీనం.. కట్టలేక విహీనం
[ 03-05-2024]
తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న సముద్ర కరకట్టలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా వైకాపా సర్కరు అయిదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ప్రాంతాల్లో గుంతలు, గండ్లు ఏర్పడి కరకట్టలు బలహీనపడ్డాయి. -
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితంలా ఉంది
[ 03-05-2024]
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితం మాదిరిగా ఉందని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.1000 లాగేసే విధంగా వారి మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. -
‘చంద్రబాబును గెలిపించుకుందాం’
[ 03-05-2024]
పింఛనుదారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఓ చరిత్ర అని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అన్నారు. -
నమ్మించారు.. నట్టేట ముంచారు
[ 03-05-2024]
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి ఉద్యోగులంతా ఆనందపడ్డారు. అనంతరం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవడంతో అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. -
హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
[ 03-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కొండకు గుండు కొట్టారు.. అందినంత మింగేశారు
[ 03-05-2024]
ఆంధ్రాలో సహజ వనరుల దోపిడీలో మట్టి మాఫియా విధ్వంసానికి అడ్డు లేకుండాపోయింది. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరించడం, తనిఖీలు చేసే అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. -
ప్రలోభ రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు
[ 03-05-2024]
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రలోభాలు లేని వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలా... తూచ్. అవి ప్రతిపక్షాలకే గానీ.. మాకు కాదు అంటున్నారు విజయవాడ సెంట్రల్లోని అధికార వైకాపా నేతలు. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ... బరి తెగిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, నివాసాలపై విచ్చలవిడిగా వైకాపా స్టిక్కర్లు అంటించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల తీర్పునకు వేళాయె..!
[ 03-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి వీలుగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
కేంద్ర బలగాల కనుసన్నల్లో సెంట్రల్ ఓటింగ్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి, లక్షలాదిగా పట్టుబడిన వైకాపా కుక్కర్ కూపన్లు.. కేసులకు కేంద్రమైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. -
‘అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం’
[ 03-05-2024]
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైకాపాను సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా పిలుపు నిచ్చారు. గురువారం వల్లూరుపాలెం, పాములలంక, తోట్లవల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నడవలేని వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు
[ 03-05-2024]
ఇళ్లలో మంచం నుంచి కదల్లేని వయోవృద్ధులకు గురువారం ఇంటి వద్దే ప్రత్యేక ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహించి వారితో ఓటు వేయించారు. నియోజకర్గంలో గురువారం 166 మందితో ఓటు వేయించారు. -
అహంకారి నానికి గుణపాఠం చెప్పాలి: రాము
[ 03-05-2024]
అసమర్థ వైకాపా ప్రభుత్వానికి, అహంకారి నానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
కనీస వసతులూ కల్పించరా నానీ
[ 03-05-2024]
గుడివాడ పట్టణంలోని పాటి మీద ప్రాంతంగా పిలిచే జగన్నాథపురానికి ప్రత్యేకత ఉంది. 31, 32 వార్డుల పరిధిలో చరిత్రక వెంకటేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఆఫీసర్స్ క్లబ్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు