logo

ప్రేక్షకులకు వినోదం అందించడమే ధ్యేయం : నందమూరి బాలకృష్ణ

తెలుగు ప్రజలకు  వినోదం అందించడమే తన ధ్యేయమని కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్సులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంలో రానున్న అన్‌స్టాపబుల్‌-2 టీజర్‌ను విడుదల చేశారు. 

Published : 05 Oct 2022 01:49 IST

అభిమానులకు అభివాదం చేస్తున్న బాలకృష్ణ

కానూరు, న్యూస్‌టుడే: తెలుగు ప్రజలకు  వినోదం అందించడమే తన ధ్యేయమని కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్సులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంలో రానున్న అన్‌స్టాపబుల్‌-2 టీజర్‌ను విడుదల చేశారు.  ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చిన ఈ ఆన్‌స్టాపబుల్‌-1 మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ అన్‌స్టాపబుల్‌-2 చేస్తున్నామన్నారు. హాస్యనటులు అల్లు రామలింగయ్య కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ అభిమానులను అలరించేలా సినిమా, టీవీల్లో, ఓటీటీల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. సినీ కళాకారులు, నృత్యకళాకారిణులు నృత్యాలతో అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని