logo

బీరు సీసాతో భార్యపై భర్త దాడి

స్థానిక బీసీకాలనీలో సోమవారం భార్యపై భర్త బీరుసీసాతో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.

Published : 28 Mar 2023 04:45 IST

చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి 

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక బీసీకాలనీలో సోమవారం భార్యపై భర్త బీరుసీసాతో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సీఐ కె.సతీష్‌ తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక డీవీఆర్‌కాలనీకి చెందిన పల్లపు ఆంజనేయులు లారీ క్లీనరుగా పని చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం బీసీకాలనీకి చెందిన శ్రీలక్ష్మితో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో తరుచూ భర్త వేధిస్తుండటంతో నందిగామ పోలీసుస్టేషన్లో భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గత ఏడు నెలలుగా శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో సోమవారం ఉదయాన్నే భర్త శ్రీలక్ష్మి ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంది. భర్త మాట విన్న ఆమె భయంతో లోపలే ఉంది. అనంతరం వెళ్లిపోయాడని భావించి బయటకు రాగా బీరు సీసాతో దాడి చేసి ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. అడ్డం వచ్చిన వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలైన ఆమెను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సీఐ సతీష్‌, ఎస్సై పండుదొర వెంటనే అంబులెన్స్‌ మాట్లాడి విజయవాడకు పంపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని