రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం.
రహస్య సమావేశాలు పెట్టి మరీ వేధింపులు
ఈనాడు, అమరావతి : ‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. ఓట్లు వేయించకపోతే మీరు ఉండి వృథా. రాజీనామా చేసిన వాళ్లకు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.10 వేలు ముందే ఇస్తాం. చేయకపోతే మళ్లీ రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఊరుకునేది లేదు. మా కోసం పనిచేసిన వాళ్లను మాత్రమే ఉంచుతాం.’.. అంటూ గుడివాడ, విజయవాడ తూర్పు, మధ్య, పెనమలూరు నియోజకవర్గాల్లో వాలంటీర్లను వైకాపా అభ్యర్థులు, వారి అనుచరులు బెదిరిస్తున్నట్లు తెలిసింది.
తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తొలగించబోమని, రూ.10 వేల వేతనం ఇస్తామంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ప్రస్తుతం వైకాపా నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు ప్రకటనతో అత్యధిక శాతం వాలంటీర్లలో ఆశలు చిగురించాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 22,400 మంది వాలంటీర్లున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 మంది వరకు ఉన్నారు. కృష్ణాలో 12 వేలు, ఎన్టీఆర్లో 10,400 మంది ఉండగా.. ఇప్పటివరకూ రెండు జిల్లాల్లో కలిపినా కనీసం రెండు వేల మంది కూడా రాజీనామాలు చేయలేదు. కృష్ణాలో 1,155 మంది రాజీనామాలివ్వగా.. వారిలో వెయ్యి మంది వరకూ మచిలీపట్నంలోనే చేశారు. ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు కృష్ణమూర్తి బలవంతం చేయడంతో వీళ్లంతా ఒకేసారి రాజీనామాలు చేసి ప్రస్తుతం బాధపడుతున్నారని తెలిసింది.
కొందరు నాయకులకు ఇదే పని..
వాలంటీర్లను రాజీనామాలు చేయించాలంటూ.. కొందరు వైకాపా నాయకులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. గుడివాడలో కొడాలి నాని కీలక అనుచరుడైన నియోజకవర్గస్థాయి నాయకుడికి బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. దీంతో ఆయన నిత్యం వాలంటీర్ల ఇళ్లకు వెళ్లి మరీ రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీంతో మాకు ఇదేం తలనొప్పులంటూ.. పలువురు వాలంటీర్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు మాత్రం చేసేది లేదంటూ.. తేల్చి చెబుతున్నారు. గుడివాడలో ఇప్పటివరకూ 74 మంది మాత్రమే వైకాపా నేతల బలవంతం మీద రాజీనామాలు చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమలోనూ ఇలాగే కొంతమంది నేతలకు ప్రత్యేకంగా బాధ్యత అప్పగించి రాజీనామాలు చేయించాలంటూ వైకాపా అభ్యర్థులు సూచించినట్టు తెలిసింది.
సహకరించకుంటే ఇబ్బందులే..
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆదేశాలతో ఆయన కీలక అనుచరుడైన ఓ చోటా వైకాపా నాయకుడి ఆధ్వర్యంలో వాలంటీర్లతో గురువారం రహస్యంగా సమావేశం నిర్వహించారు. రాణిగారితోట ప్రాంతంలోని 17వ డివిజన్ పరిధి బాపనయ్యనగర్లో ఓ పాఠశాలకు సమీపంలో ఈ సమావేశం జరిగింది. వాలంటీర్లను అక్కడికి రప్పించి.. వారితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ రాజీనామాలు చేసి.. దేవినేని అవినాష్ గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చేసేవాళ్లకి రూ.10వేలు ఇస్తామని, చేయని వారికి తమ ప్రభుత్వం మళ్లీ వస్తే.. ఇబ్బందులు తప్పవంటూ ఆ నాయకుడు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. రాజీనామా చేస్తామని అంగీకరించి సంతకాలు చేసిన వాళ్లకు విందు భోజనాలు సైతం పెట్టి పంపించినట్టు తెలుస్తోంది. ఇలాగే.. అన్ని నియోజకవర్గాల్లోనూ వాలంటీర్లతో రహస్య సమావేశాలు పెట్టి, వారితో రాజీనామా చేయించి.. బలవంతంగా తమ కోసం ప్రచారం చేయించుకోవాలని.. వైకాపా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిలదీతలు పెరిగిపోవడంతో..
వాలంటీర్లకు ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో రోజూ ఫోన్లు చేసి.. రాజీనామా చేయాలంటూ వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపా అభ్యర్థుల తరఫున ఇంటింటికీ ప్రచారం చేసేవాళ్లు కరవయ్యారు. విజయవాడ మధ్య, తూర్పు, పశ్చిమ, గుడివాడ, పెనమలూరుల్లో.. అభ్యర్థులు ప్రచారంలో వెనుకపడ్డారు. దీంతో నిత్యం డబ్బులిచ్చి.. కొంతమందిని జెండాలు పట్టుకొని తమ వెనుక తిప్పుతున్నారు. వైకాపా చోటా నాయకుల హడావుడి ఎక్కువైపోయింది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తుండడంతో.. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా మంచినీళ్లు, ఇళ్లు, పట్టాలు, విద్యుత్తు సమస్యలు, రహదారులు.. ఇలా సమస్యలతో నిలదీస్తున్నారు. అందుకే వాలంటీర్లు తమ వెంట ఉంటే.. ముందుగానే ప్రచారానికి ఎటువెళ్లాలి, ఎటు వెళ్లకూడదు.. అనే సమాచారం ఇవ్వడంతో పాటు, పింఛనుదారులను ప్రభావితం చేయగలరని వైకాపా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే.. వారితో బలవంతంగా రాజీనామా చేసైనా తమతో పాటు ఈ 20 రోజులు ప్రచారంలో తిప్పుకోవాలని.. గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. వీళ్లు ఎంత బలవంతం చేస్తున్నా.. వాలంటీర్లు మాత్రం రాజీనామాలు చేసేందుకు అంగీకరించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
[ 03-05-2024]
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
సైకిలెక్కిన సర్పంచి.. సొంతూరులో వంశీకి షాక్
[ 03-05-2024]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వగ్రామం ఉంగుటూరు వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్ గురువారం తెదేపాలో చేరారు. -
వికృత క్రీడతో.. విల‘పింఛెను’
[ 03-05-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ఆడిన జగన్నాటకానికి పింఛనుదారులు నరకం చవిచూశారు. వైకాపా అరాచకం.. ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కిట్టూ దర్శకత్వం.. నీలిమూకల అరాచకం!
[ 03-05-2024]
వైకాపా యువనేత, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టూ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు ఎదురేముంది అన్నట్లు అనుచరులను ప్రోత్సహిస్తూ.. పట్టపగలే దాడులకు ఉసిగొల్పుతున్నారు. -
గుడివాడ, అవనిగడ్డలో పవన్కల్యాణ్ పర్యటన రేపు
[ 03-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కట్టలు బలహీనం.. కట్టలేక విహీనం
[ 03-05-2024]
తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న సముద్ర కరకట్టలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా వైకాపా సర్కరు అయిదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ప్రాంతాల్లో గుంతలు, గండ్లు ఏర్పడి కరకట్టలు బలహీనపడ్డాయి. -
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితంలా ఉంది
[ 03-05-2024]
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితం మాదిరిగా ఉందని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.1000 లాగేసే విధంగా వారి మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. -
‘చంద్రబాబును గెలిపించుకుందాం’
[ 03-05-2024]
పింఛనుదారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఓ చరిత్ర అని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అన్నారు. -
నమ్మించారు.. నట్టేట ముంచారు
[ 03-05-2024]
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి ఉద్యోగులంతా ఆనందపడ్డారు. అనంతరం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవడంతో అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. -
హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
[ 03-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కొండకు గుండు కొట్టారు.. అందినంత మింగేశారు
[ 03-05-2024]
ఆంధ్రాలో సహజ వనరుల దోపిడీలో మట్టి మాఫియా విధ్వంసానికి అడ్డు లేకుండాపోయింది. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరించడం, తనిఖీలు చేసే అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. -
ప్రలోభ రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు
[ 03-05-2024]
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రలోభాలు లేని వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలా... తూచ్. అవి ప్రతిపక్షాలకే గానీ.. మాకు కాదు అంటున్నారు విజయవాడ సెంట్రల్లోని అధికార వైకాపా నేతలు. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ... బరి తెగిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, నివాసాలపై విచ్చలవిడిగా వైకాపా స్టిక్కర్లు అంటించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల తీర్పునకు వేళాయె..!
[ 03-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి వీలుగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
కేంద్ర బలగాల కనుసన్నల్లో సెంట్రల్ ఓటింగ్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి, లక్షలాదిగా పట్టుబడిన వైకాపా కుక్కర్ కూపన్లు.. కేసులకు కేంద్రమైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. -
‘అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం’
[ 03-05-2024]
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైకాపాను సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా పిలుపు నిచ్చారు. గురువారం వల్లూరుపాలెం, పాములలంక, తోట్లవల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నడవలేని వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు
[ 03-05-2024]
ఇళ్లలో మంచం నుంచి కదల్లేని వయోవృద్ధులకు గురువారం ఇంటి వద్దే ప్రత్యేక ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహించి వారితో ఓటు వేయించారు. నియోజకర్గంలో గురువారం 166 మందితో ఓటు వేయించారు. -
అహంకారి నానికి గుణపాఠం చెప్పాలి: రాము
[ 03-05-2024]
అసమర్థ వైకాపా ప్రభుత్వానికి, అహంకారి నానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
కనీస వసతులూ కల్పించరా నానీ
[ 03-05-2024]
గుడివాడ పట్టణంలోని పాటి మీద ప్రాంతంగా పిలిచే జగన్నాథపురానికి ప్రత్యేకత ఉంది. 31, 32 వార్డుల పరిధిలో చరిత్రక వెంకటేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఆఫీసర్స్ క్లబ్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య