మహా మాయగాళ్లు..!
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.
అవసరం తీరాక గాలికొదిలేసిన వైనం
రూపాయి రిజిస్ట్రేషన్లంటూ టిడ్కో లబ్ధిదారులకు వల
ఈనాడు, అమరావతి : ‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయించేసి.. నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చేస్తా. రుణం లేకుండా విముక్తి చేస్తా. అవసరమైతే వన్ టైం సెటిల్మెంట్ చేస్తా.’
2018లో ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుడివాడకు వచ్చినప్పుడు ఇచ్చిన అనేక హామీల్లో ఇది ఒకటి.
గద్దెనెక్కాక.. ఏం చేశారో తెలుసా?
కల్లబొల్లి మాటలను నమ్మిన జనం ఓట్లేసి జగన్ను గద్దెనెక్కిస్తే... ఆయనేమో ఇచ్చిన మాటలను తూచ్ అని పక్కన పెట్టేశారు. గుడివాడ మల్లాయపాలెంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని 80 శాతం పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. లబ్ధిదారులకిచ్చేందుకు కేవలం మూడునాలుగు నెలలకు మించి పట్టదు. కానీ.. 2019 జూన్లో అధికారంలోకొచ్చిన జగన్ 2023 జూన్ వరకూ టిడ్కో ఇళ్లను గాలికొదిలేయడంతో అవి శిథిలస్థితికి చేరాయి.
మళ్లీ ఎన్నికలొచ్చాయని జగనొచ్చి..!
మళ్లీ సార్వత్రిక ఎన్నికలొస్తున్నాయని జనం గుర్తొచ్చినట్టున్నారు. తొమ్మిది నెలల కిందట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కళ్లు తెరిచారు. చంద్రబాబు కట్టిన ఇళ్లకు హడావుడిగా వైకాపా రంగులేసేసి.. ముఖ్యమంత్రి జగన్ను తీసుకొచ్చి పంపిణీ చేసేశారు. కనీసం డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్తులాంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ఆనందంగా ఇళ్లల్లోకి దిగిన లబ్ధిదారులు అక్కడి పరిస్థితి చూసి షాక్ తిన్నారు. ఇవేం ఇళ్లు.. ఇదేం సర్కారంటూ గగ్గోలు పెట్టారు. చాలామంది ఇళ్లను ఖాళీ చేసి వెనక్కి వచ్చేశారు. దీనికి కారకులైన.. ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని తీరును నిరసిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గుడివాడలోని పది ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళనలు చేశారంటే వారి ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.
మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్లు
డబ్బులు కట్టినోళ్లనూ తప్పించేసి..
గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకు ఎంపికై.. డబ్బులు కట్టిన చాలామంది లబ్ధిదారులను కొడాలి నాని, ఆయన అనుచరుల నేతృత్వంలో తప్పించేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చాయని, కారుందని, సిబిల్ స్కోర్ సరిగా లేదంటూ ఏవేవో సాకులను చూపించి తెదేపా సానుభూతిపరులు, రాజకీయాలతో సంబంధం లేని నిరుపేదల పేర్లను జాబితా నుంచి తప్పించేశారు. గత ప్రభుత్వంలో ఫ్లాట్లు దక్కించుకుని, తాళాలు తీసుకున్న వాళ్లను సైతం అన్యాయంగా తప్పించేశారు.
వడ్డీతో కట్టిస్తున్నారు..
- గత తెదేపా ప్రభుత్వ హయాంలో గుడివాడ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులను జీ ప్లస్ త్రీ నమూనాలో 8,912 ఇళ్లను నిర్మించారు. వీటిని సుమారు 7 వేల మందికి కేటాయించారు.
- 365 చదరపు అడుగుల ఫ్లాట్కు రూ. 7.55 లక్షలు, 430 చదరపు అడుగుల ఫ్లాట్కు రూ. 8.50 లక్షలను లబ్ధిదారులు కట్టాలి.
- ప్రస్తుతం 365 చ.అడుగుల ఫ్లాట్ల లబ్ధిదారులు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు, 430 చ.అడుగుల ఫ్లాట్ల లబ్ధిదారులు నెలకు రూ. 5 వేల నుంచి రూ. 5,700 మధ్యలో బ్యాంకులకు వాయిదాలు కట్టాల్సి వస్తోంది.
ఇంత మోసమా
‘మాట తప్పను.. మడమ తిప్పను.., ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్తా..’ లాంటి సినిమా డైలాగులను వేదికలపై చదివే సీఎం జగన్.. వాస్తవంలో తన అసలు రూపం చూపించారు. తాను హామీ ఇచ్చాననే మాట కూడా మరచిపోవటం గమనార్హం. తొమ్మిది నెలల కిందట జగన్ స్వయంగా టిడ్కో ఇళ్ల పత్రాలను ఇవ్వడంతో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రుణభారం ఉండదని లబ్ధిదారులు భావించారు. కానీ.. రూపాయికే రిజిస్ట్రేషన్ హామీ.. ఉత్తుత్తినే జగన్ చెప్పారన్నట్టుగా.. కొడాలి నాని తప్పించుకు తిరుగుతున్నారు. ఇదేంటని ఆయన్ను లబ్ధిదారులు నిలదీస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడి చేయిస్తానంటూ చెప్పి మాయమవుతున్నారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- 430 చ.అడుగుల ఫ్లాట్ల లబ్ధిదారులు 6,336 మంది. వీరు బ్యాంకుకు కట్టాల్సిన రుణ మొత్తం రూ. 541.72 కోట్లు.
- 365 చ.అడుగుల ఇళ్ల లబ్ధిదారులు 992 మంది. వీరు బ్యాంకులకు కట్టాల్సిన మొత్తం రూ. 74.69 కోట్లు.
- మొత్తం రూ. 616.41 కోట్లను లబ్ధిదారులు కట్టక్కర్లేకుండా చేస్తానంటూ చెప్పిన జగన్... ఇపుడు మొహం చాటేశారు.
- గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఇళ్లు మంజూరవడంతో లబ్ధిదారులు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకూ అప్పులు చేసి ముందుగా చెల్లించారు. ఆ డబ్బులూ ఇవ్వకుండానే చాలామందిని వైకాపా అధికారంలోకొచ్చాక తప్పించేశారు. కనీసం తమ డబ్బులైనా వెనక్కి ఇవ్వాలంటూ వారంతా గత అయిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ ఇళ్లను ఉచితంగా ఇస్తానన్న సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని పత్తా లేరు.
అవస్థలమయంగా ఉన్న ఇళ్లల్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు కట్టే డబ్బులతో గుడివాడలోనే మంచి ఇళ్లల్లో ఉండొచ్చని టిడ్కో ఇళ్ల అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ, లబ్ధిదారులు ఎం.దుర్గ, గౌస్ఫీరా, సలీమున్నిషా, శివరామ్ప్రసాద్, సత్యనారాయణ, దుర్గారావు, సంగమ్మ చెబుతున్నారు. తమను ఈ ప్రభుత్వం నరక కూపంలోకి నెట్టేసి.. చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ భారీ టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద.. పాఠశాల, ఆసుపత్రి, పార్కులు, సామాజిక భవనం, పోలీసుస్టేషన్ సహా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఏమీ చేయలేదు. కనీసం వీధి దీపాలు, డ్రైనేజీ, మంచినీరు వంటివి గగనమైపోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
[ 03-05-2024]
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
సైకిలెక్కిన సర్పంచి.. సొంతూరులో వంశీకి షాక్
[ 03-05-2024]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వగ్రామం ఉంగుటూరు వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్ గురువారం తెదేపాలో చేరారు. -
వికృత క్రీడతో.. విల‘పింఛెను’
[ 03-05-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ఆడిన జగన్నాటకానికి పింఛనుదారులు నరకం చవిచూశారు. వైకాపా అరాచకం.. ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కిట్టూ దర్శకత్వం.. నీలిమూకల అరాచకం!
[ 03-05-2024]
వైకాపా యువనేత, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టూ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు ఎదురేముంది అన్నట్లు అనుచరులను ప్రోత్సహిస్తూ.. పట్టపగలే దాడులకు ఉసిగొల్పుతున్నారు. -
గుడివాడ, అవనిగడ్డలో పవన్కల్యాణ్ పర్యటన రేపు
[ 03-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కట్టలు బలహీనం.. కట్టలేక విహీనం
[ 03-05-2024]
తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న సముద్ర కరకట్టలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా వైకాపా సర్కరు అయిదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ప్రాంతాల్లో గుంతలు, గండ్లు ఏర్పడి కరకట్టలు బలహీనపడ్డాయి. -
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితంలా ఉంది
[ 03-05-2024]
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితం మాదిరిగా ఉందని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.1000 లాగేసే విధంగా వారి మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. -
‘చంద్రబాబును గెలిపించుకుందాం’
[ 03-05-2024]
పింఛనుదారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఓ చరిత్ర అని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అన్నారు. -
నమ్మించారు.. నట్టేట ముంచారు
[ 03-05-2024]
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి ఉద్యోగులంతా ఆనందపడ్డారు. అనంతరం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవడంతో అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. -
హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
[ 03-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కొండకు గుండు కొట్టారు.. అందినంత మింగేశారు
[ 03-05-2024]
ఆంధ్రాలో సహజ వనరుల దోపిడీలో మట్టి మాఫియా విధ్వంసానికి అడ్డు లేకుండాపోయింది. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరించడం, తనిఖీలు చేసే అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. -
ప్రలోభ రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు
[ 03-05-2024]
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రలోభాలు లేని వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలా... తూచ్. అవి ప్రతిపక్షాలకే గానీ.. మాకు కాదు అంటున్నారు విజయవాడ సెంట్రల్లోని అధికార వైకాపా నేతలు. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ... బరి తెగిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, నివాసాలపై విచ్చలవిడిగా వైకాపా స్టిక్కర్లు అంటించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల తీర్పునకు వేళాయె..!
[ 03-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి వీలుగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
కేంద్ర బలగాల కనుసన్నల్లో సెంట్రల్ ఓటింగ్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి, లక్షలాదిగా పట్టుబడిన వైకాపా కుక్కర్ కూపన్లు.. కేసులకు కేంద్రమైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. -
‘అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం’
[ 03-05-2024]
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైకాపాను సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా పిలుపు నిచ్చారు. గురువారం వల్లూరుపాలెం, పాములలంక, తోట్లవల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నడవలేని వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు
[ 03-05-2024]
ఇళ్లలో మంచం నుంచి కదల్లేని వయోవృద్ధులకు గురువారం ఇంటి వద్దే ప్రత్యేక ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహించి వారితో ఓటు వేయించారు. నియోజకర్గంలో గురువారం 166 మందితో ఓటు వేయించారు. -
అహంకారి నానికి గుణపాఠం చెప్పాలి: రాము
[ 03-05-2024]
అసమర్థ వైకాపా ప్రభుత్వానికి, అహంకారి నానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
కనీస వసతులూ కల్పించరా నానీ
[ 03-05-2024]
గుడివాడ పట్టణంలోని పాటి మీద ప్రాంతంగా పిలిచే జగన్నాథపురానికి ప్రత్యేకత ఉంది. 31, 32 వార్డుల పరిధిలో చరిత్రక వెంకటేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఆఫీసర్స్ క్లబ్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్