అంతా మోసం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జులై 2023 నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ కాగితాలకే పరిమితమైంది. ఐఆర్ (మధ్యంతర భృతి) గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.
పీఆర్సీ, ఐఆర్పై పెదవి విప్పని వైకాపా ప్రభుత్వం
అసంతృప్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
న్యూస్టుడే, కూచిపూడి, గుడ్లవల్లేరు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జులై 2023 నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ కాగితాలకే పరిమితమైంది. ఐఆర్ (మధ్యంతర భృతి) గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయం రావడంతో ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలతోపాటు ఐఆర్పైనా నిర్ణయం ప్రకటిస్తుందని సంఘాలు ఎదురు చూశాయి. 12వ పీఆర్సీ(వేతన సవరణ సంఘం)కి సంబంధించి కమిషన్ను నియమించినా పని చేయడానికి సిబ్బంది, కార్యాలయం వంటివి ఇవ్వలేదు. 30 శాతం ఐఆర్తోపాటు కొత్తగా రెండు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఐఆర్ ప్రకటిస్తారని ఆశించారు. పన్నెండో పీఆర్సీ ఏర్పడకపోవడం, కనీసం ఐఆర్పైనా నిర్ణయం వెలువడకపోవడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల గోడు పట్టించుకోలేదు
- ఓ ఉపాధ్యాయిని
ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వారిగోడు పట్టనట్లు వ్యహరించింది. డీఏలు కూడా అరకొరగానే మంజూరు చేసింది. బకాయిలు ఖాతాలకు జమ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోంది.
ఐఆర్కు మంగళం పాడింది
- ఒక ఉద్యోగి
ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అధికారం మేనెల వరకే ఉంటే జులైలో ఒకే సారి పీఆర్సీ ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. పెండింగ్ బకాయిలపై మాట్లాడడం లేదు.
ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర నిరాశ
- యూటీఎఫ్ ప్రతినిధి
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 నెలలు ఆలస్యంగా రివర్స్ పీఆర్సీని ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. ఐఆర్ కంటే ఫిట్మెంట్ 4 శాతం తగ్గించడం దేశంలో ఎక్కడా జరగలేదు. దీని వల్ల సగటు ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో 2-3 ఇంక్రిమెంట్లు నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదు.
ప్రభుత్వ తీరు సరికాదు
- ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు
ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బకాయిలు రాలేదు. ఎప్పుడిస్తారో తెలీదు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏలో మొదటి రెండు డీఏలు సీపీఎస్ వారికి రాలేదు. మిగిలిన ఐదు డీఏలను పీఆర్సీలో కలిపి వేశామని ప్రభుత్వం చెబుతోంది. పీఆర్సీ ఇచ్చిన తరువాత కూడా మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
[ 03-05-2024]
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
సైకిలెక్కిన సర్పంచి.. సొంతూరులో వంశీకి షాక్
[ 03-05-2024]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వగ్రామం ఉంగుటూరు వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్ గురువారం తెదేపాలో చేరారు. -
వికృత క్రీడతో.. విల‘పింఛెను’
[ 03-05-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ఆడిన జగన్నాటకానికి పింఛనుదారులు నరకం చవిచూశారు. వైకాపా అరాచకం.. ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కిట్టూ దర్శకత్వం.. నీలిమూకల అరాచకం!
[ 03-05-2024]
వైకాపా యువనేత, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టూ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు ఎదురేముంది అన్నట్లు అనుచరులను ప్రోత్సహిస్తూ.. పట్టపగలే దాడులకు ఉసిగొల్పుతున్నారు. -
గుడివాడ, అవనిగడ్డలో పవన్కల్యాణ్ పర్యటన రేపు
[ 03-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కట్టలు బలహీనం.. కట్టలేక విహీనం
[ 03-05-2024]
తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న సముద్ర కరకట్టలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా వైకాపా సర్కరు అయిదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ప్రాంతాల్లో గుంతలు, గండ్లు ఏర్పడి కరకట్టలు బలహీనపడ్డాయి. -
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితంలా ఉంది
[ 03-05-2024]
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితం మాదిరిగా ఉందని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.1000 లాగేసే విధంగా వారి మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. -
‘చంద్రబాబును గెలిపించుకుందాం’
[ 03-05-2024]
పింఛనుదారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఓ చరిత్ర అని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అన్నారు. -
నమ్మించారు.. నట్టేట ముంచారు
[ 03-05-2024]
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి ఉద్యోగులంతా ఆనందపడ్డారు. అనంతరం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవడంతో అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. -
హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
[ 03-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కొండకు గుండు కొట్టారు.. అందినంత మింగేశారు
[ 03-05-2024]
ఆంధ్రాలో సహజ వనరుల దోపిడీలో మట్టి మాఫియా విధ్వంసానికి అడ్డు లేకుండాపోయింది. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరించడం, తనిఖీలు చేసే అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. -
ప్రలోభ రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు
[ 03-05-2024]
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రలోభాలు లేని వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలా... తూచ్. అవి ప్రతిపక్షాలకే గానీ.. మాకు కాదు అంటున్నారు విజయవాడ సెంట్రల్లోని అధికార వైకాపా నేతలు. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ... బరి తెగిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, నివాసాలపై విచ్చలవిడిగా వైకాపా స్టిక్కర్లు అంటించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల తీర్పునకు వేళాయె..!
[ 03-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి వీలుగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
కేంద్ర బలగాల కనుసన్నల్లో సెంట్రల్ ఓటింగ్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి, లక్షలాదిగా పట్టుబడిన వైకాపా కుక్కర్ కూపన్లు.. కేసులకు కేంద్రమైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. -
‘అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం’
[ 03-05-2024]
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైకాపాను సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా పిలుపు నిచ్చారు. గురువారం వల్లూరుపాలెం, పాములలంక, తోట్లవల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నడవలేని వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు
[ 03-05-2024]
ఇళ్లలో మంచం నుంచి కదల్లేని వయోవృద్ధులకు గురువారం ఇంటి వద్దే ప్రత్యేక ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహించి వారితో ఓటు వేయించారు. నియోజకర్గంలో గురువారం 166 మందితో ఓటు వేయించారు. -
అహంకారి నానికి గుణపాఠం చెప్పాలి: రాము
[ 03-05-2024]
అసమర్థ వైకాపా ప్రభుత్వానికి, అహంకారి నానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
కనీస వసతులూ కల్పించరా నానీ
[ 03-05-2024]
గుడివాడ పట్టణంలోని పాటి మీద ప్రాంతంగా పిలిచే జగన్నాథపురానికి ప్రత్యేకత ఉంది. 31, 32 వార్డుల పరిధిలో చరిత్రక వెంకటేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఆఫీసర్స్ క్లబ్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?