జగన్ అన్ని రంగాలను దోచేశారు : వర్ల
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు.
తోట్లవల్లూరు, న్యూస్టుడే: శాండ్, ల్యాండ్, మైన్, వైన్ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. మండలంలోని గుర్విందపల్లి, చినపులిపాక, బొడ్డపాడు, రొయ్యూరు గ్రామాల్లో సూపర్-6 పథకాలను విస్తృతంగా ప్రచారం తెదేపా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంటక గురుమూర్తి, నాయకులు వీరపనేని శివరామప్రసాద్, గోపాలకృష్ణ, రేణుకారావు, జనసేన నాయకుడు తాడిశెట్టి నరేష్, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెదేపాలో చేరిక
రొయ్యూరు(తోట్లవల్లూరు), న్యూస్టుడే: రొయ్యూరులో శనివారం పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా మండల అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్, వీరంకి వెంకట గురుమూర్తి, రేణుకారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పామర్రు, న్యూస్టుడే: తెదేపా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కుమార్రాజా భార్య విశ్రమ అభ్యర్థించారు. శనివారం పామర్రు శివారు చాట్లవానిపురంలో మన ఇంటికి మన వర్ల కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఆమె సూపర్-6 పథకాలను స్థానికులకు వివరించి, కరపత్రాలు పంపిణీ చేశారు.
స్థానిక వీరాంజనేయ కాలనీలో తెదేపా నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం మన ఇంటికి న వర్ల కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు గుంపా గంగాధర్, టౌన్ అధ్యక్షుడు పరసా సుబ్రహ్మణ్యం పాల్గొని తెదేపా అభ్యర్థి వర్ల కుమార్రాజాను, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కపిలేశ్వరపురం(పమిడిముక్కల),న్యూస్టుడే: ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్రాజాను గెలిపించాలని కోరుతూ శనివారం వర్ల సోదరుడు చాణుక్య, నాయకులు చిగురుపాటి జగదీష్, గోవిందు, ఫణిబాబులు ఇంటింటి ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి నేతల ఇంటింటి ప్రచారం
[ 11-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ కొడాలిలో తెదేపా, జనసేన నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. -
అభిమాన నేతపై.. అనురాగ జల్లు
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గన్నవరం వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్తో పాటు, స్థానిక వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. -
మాటలేనా.. చేతలేవని?
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి రాగానే గుడివాడను సుందరంగా తీర్చి దిద్దుతానని, భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేస్తాననీ కొడాలి నాని గతంలో పలుమార్లు పలు సభల్లో నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. -
సీఎం హామీ కృష్ణార్పణం
[ 11-05-2024]
కృష్ణా నది వరదల నుంచి రక్షణ కవచంగా ఉన్న 90 కిమీ పొడవు ఉన్న కుడి, ఎడమ కరకట్టలు మరమ్మతులకు నోచుకోక బలహీనపడ్డాయి. నది పరీవాహక గ్రామాలకు రహదారి సౌకర్యంగా ఉన్న కరకట్టలు నేడు గండ్లుపడి బీటలు వారుతున్నా పట్టించుకోలేదు. -
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
[ 11-05-2024]
‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
బాబుపై పగ.. రైతన్నకు దగా!
[ 11-05-2024]
ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోరే సమర్థులైన పాలకులైతే ఏం చేస్తారు? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చేవారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు తప్పనిసరి
[ 11-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. -
వరములీయవే.. మహాలక్ష్మీ
[ 11-05-2024]
ఇంద్రకీలాద్రి: అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. -
ఓట్ల పండగకు వస్తున్నారోచ్..
[ 11-05-2024]
రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండగలో పాల్గొనేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. -
ఊళ్లన్నారు... ఎక్కడ వంశీ?
[ 11-05-2024]
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. -
సంక్షేమమన్నారు.. మాకేమి చేశారు
[ 11-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తాం. మహిళలకు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చి ఆర్థ్ధికంగా ఆదుకుంటాం. -
మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 11-05-2024]
మాదిగలకు అండగా నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
ఇండియాకు ఓటేయండి.. మీ భవితను నిర్ణయించుకోండి
[ 11-05-2024]
రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే.. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. -
గంజాయికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
[ 11-05-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె.లక్ష్మి విమర్శించారు.