కరోనాలోనూ కనికరించలె..
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
మద్యం దుకాణాల వద్ద నియమించడంపై గురువుల మండిపాటు
న్యూస్టుడే, కూచిపూడి
కొవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైన్ షాపుల వద్ద జనం గుమిగూడకుండా, భౌతికదూరం పాటించే గురుతర బాధ్యతను గురువుల నెత్తిన పెట్టింది. నమస్కారం పెట్టించుకోవాల్సిన గురువులే తాగుబోతులకు చేతులు జోడించి మరీ కరోనా నియమాలు పాటిస్తూ మద్యం తాగాలని వేడుకునేలా చేసింది. సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. దీంతో వైకాపా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం నేరం. నాడు - నేడు తొలి విడత కార్యక్రమాన్ని కరోనా సమయంలో ఆపొద్దని, లాక్డౌన్లో కూడా టార్గెట్ పూర్తి చేయాలనడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. సిమెంట్, ఐరన్ దుకాణాలకు వెళ్లి సామగ్రి కొనుగోలు చేసి మరమ్మతులు చేయించే క్రమంలో అనేక మందికి కరోనా సోకింది.
ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం
ఉపాధ్యాయులు కొవిడ్ కాలంలో 50 శాతం జీతం మాత్రమే తీసుకున్నారు. వారేమీ ఫ్రంట్లైన్ వారియర్స్ కాకపోయినప్పటికీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాల్లో, కొవిడ్ ఆసుపత్రుల్లో రోగులను వరుస క్రమంలో పంపడానికి, రైతుబజార్ల దగ్గర, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద, చెక్పోస్టుల దగ్గర విధులు కేటాయించింది. ఉపాధ్యాయులకు సక్రమంగా మాస్క్లు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వకుండా డ్యూటీలు చేయించడంతో అనేక మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు.
చరవాణి వాడితే క్రమశిక్షణ చర్యలు
- ఒక ఉపాధ్యాయుడు
జగనన్న విద్యా దీవెన(జేవీకే) కిట్ల పంపిణీ యాప్లో అప్లోడ్ చేయాలి. తల్లి, తండ్రి వేలిముద్రలు వేయాలి. పాఠ్య, రాత పుస్తకాలు, సాక్సులు, బూట్లు వంటివి అన్ని అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయుడు పాఠశాలలో చరవాణి వినియోగిస్తే విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు వేయడం సరికాదు. ఇష్టం లేకుండానే విధులకు వెళ్లాము.
మద్యం దుకాణాల వద్ద విధులేంటి?
- ఉపాధ్యాయిని
గురువులకు మద్యం దుకాణాల వద్ద విధులు వేయడం సరికాదు. వేలాది మంది పోలీసులకు, వైద్య సిబ్బందిని తయారు చేసేది ఉపాధ్యాయులే. రాష్ట్రానికి మంచి చేస్తున్నామా.. చెడుచేస్తున్నామా అని ఆలోచించే నాయకుడు లేకపొవడం దురదృష్టకరం.
ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసింది
- యూనియన్ నాయకుడు
ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారిని అడ్డం పెట్టుకొని ఉపాధ్యాయుల ఉద్యమాలను అణచివేసింది. వారు ఏమి కోల్పోతున్నారో అర్థంకాని పరిస్థితులు సృష్టించింది. రాష్ట్రస్థాయి సంఘ నాయకులు కూడా తరగతి గదులకు పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్యం మానండి అని చెప్పాల్సిన ఉపాధ్యాయులు తాగుబోతులను క్రమశిక్షణతో తాగండి అని బోధించాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి నేతల ఇంటింటి ప్రచారం
[ 11-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ కొడాలిలో తెదేపా, జనసేన నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. -
అభిమాన నేతపై.. అనురాగ జల్లు
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గన్నవరం వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్తో పాటు, స్థానిక వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. -
మాటలేనా.. చేతలేవని?
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి రాగానే గుడివాడను సుందరంగా తీర్చి దిద్దుతానని, భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేస్తాననీ కొడాలి నాని గతంలో పలుమార్లు పలు సభల్లో నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. -
సీఎం హామీ కృష్ణార్పణం
[ 11-05-2024]
కృష్ణా నది వరదల నుంచి రక్షణ కవచంగా ఉన్న 90 కిమీ పొడవు ఉన్న కుడి, ఎడమ కరకట్టలు మరమ్మతులకు నోచుకోక బలహీనపడ్డాయి. నది పరీవాహక గ్రామాలకు రహదారి సౌకర్యంగా ఉన్న కరకట్టలు నేడు గండ్లుపడి బీటలు వారుతున్నా పట్టించుకోలేదు. -
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
[ 11-05-2024]
‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
బాబుపై పగ.. రైతన్నకు దగా!
[ 11-05-2024]
ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోరే సమర్థులైన పాలకులైతే ఏం చేస్తారు? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చేవారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు తప్పనిసరి
[ 11-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. -
వరములీయవే.. మహాలక్ష్మీ
[ 11-05-2024]
ఇంద్రకీలాద్రి: అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. -
ఓట్ల పండగకు వస్తున్నారోచ్..
[ 11-05-2024]
రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండగలో పాల్గొనేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. -
ఊళ్లన్నారు... ఎక్కడ వంశీ?
[ 11-05-2024]
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. -
సంక్షేమమన్నారు.. మాకేమి చేశారు
[ 11-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తాం. మహిళలకు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చి ఆర్థ్ధికంగా ఆదుకుంటాం. -
మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 11-05-2024]
మాదిగలకు అండగా నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
ఇండియాకు ఓటేయండి.. మీ భవితను నిర్ణయించుకోండి
[ 11-05-2024]
రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే.. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. -
గంజాయికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
[ 11-05-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె.లక్ష్మి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్