వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు.
మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే: దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. నాయకులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. శనివారం సాయంత్రం నగరంలోని ఓ వేడుకమందిరంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతిసారి పట్టాభి భవనం గురించి చర్చించడానికి మనకే ఇబ్బందికరంగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాభి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.బ్రాహ్మణులకు అండగా ఉంటామని, వారు సామాజిక భవనం అడిగారని, దాని నిర్మాణానికి కూడా కృషి చేస్తానని తెలిపారు.
పదవులు తాత్కాలికమే
మంచి పనులు చేస్తారని రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారని అలా కాకుండా తన వద్ద అధికారం ఉంది..పోలీసు వ్యవస్థ ఉంది...రెవెన్యూ యంత్రాంగం ఉంది..నేను చెప్పిందే నడవాలి అనడం మూర్ఖుడు చేసే పని అన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఇచ్చింది...యూనియన్ బ్యాంకు అధికారులు డబ్బులు ఇస్తామన్నారు ..దానిని అడ్డుకున్నారంటే వారికి ఏం ప్రయోజనమో తెలియడం లేదన్నారు. తానేదో పైనుంచి దిగివచ్చాను...తాను చెప్పిందే జరగాలి, వేరేవాళ్లు చేస్తే జరగకూడదనుకోవడం తప్పని. పదవులు తాత్కాలికమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ పరోక్షంగా ఎమ్మెల్యే పేర్నిని ఉద్దేశించి విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య మాట్లాడుతూ వివిధ హామీలతో మోసం చేసేందుకు వైకాపా నాయకులు వస్తున్నారని అందరూ ఐక్యంగా ఉంటూ దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా బ్రాహ్మణ సాధికారత జిల్లా కన్వీనర్ పీవీ ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెదేపా, భాజపాలతోపాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు దూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నాగలింగం అయోధ్యరామయ్య, గూడూరి వెంకట హనుమంతరావు, నందనవనం వెంకట కృష్ణారావు, వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్, లొల్లా కుటుంబశాస్త్రి, వీఎస్ఎస్ఆర్ శర్మ, న్యాయవాదులు వింజమూరి శివరామ్, సర్వా లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలశౌరి, ఆనందసూర్యలను గజమాలతో సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల అంధకారం..
[ 12-05-2024]
ఐదేళ్ల చీకటి యుగాన్ని తలచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసి.. వ్యవస్థలన్నిటినీ కూలదోసి.. బానిస యుగాన్ని తలపించేలా సాగిన సీఎం జగన్ పాలన రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు వెనక్కి నెట్టేసింది. -
కన్నేస్తే.. కైవసాలే..!
[ 12-05-2024]
జాతీయ నేతలకు జన్మనిచ్చిన ప్రాంతమది. సంస్కృతీ సాహితీ రంగాల ప్రముఖులను జాతికందించిన పవిత్ర భూమి. ప్రత్యేక నృత్య రీతులకు పేరెన్నికగన్న కూచిపూడి నృత్యం పుట్టిన గడ్డ. ఆ నేలపై కాలుమోపితే చాలు. -
కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. -
ఖాకీ కళ్లకు వైకాపా గంతలు!
[ 12-05-2024]
వందలకొద్దీ సంచార బలగాలు.. విస్తృత బందోబస్తు.. ఎక్కడికక్కడ నిఘా.. సీసీ కెమెరాల పహారా.. ఇవేవీ వైకాపా నేతలకు అడ్డు కాలేదు. -
వెల్లువై రావాలి.. విల్లుపై సాగాలి!
[ 12-05-2024]
: ‘ఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కానీ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలోనూ.. చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకే.. మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం చేజారిపోతోంది. -
‘ఆనకట్ట’లేకపోయారు
[ 12-05-2024]
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది జలాలు సముద్రంలో కలిసిపోకుండా నిలువరిస్తాం -
ఆగని మట్టి మాఫియా ఆగడాలు
[ 12-05-2024]
ఏటా వేసవి రాగానే గుడివాడ ప్రాంతంలో ఎమ్మెల్యే కొడాలి నాని కనుసన్నల్లో మట్టి మాఫియా అయిదేళ్లుగా రెచ్చిపోతోంది. -
జీవాలపైనా జాలి లేదా.. జగన్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ పశువైద్య కేంద్రా(ఆర్ఎల్యూ)ల్లో 50 శాతానికి పైగా శిథిలావస్థలో ఉన్నాయి. 75 శాతం వీడీలు(వెటర్నరీ డిస్పెన్సరీ)లో కనీస వసతులు లేవు. మండల స్థాయిలో ఆర్ఎల్యూలు సరాసరిన ఆరు, వీడీలు రెండు చొప్పున ఉన్నాయి. -
మెట్రో రైలుకు జగన్ ఉరి!
[ 12-05-2024]
పాలకులకు దూరదృష్టి ఉండాలి.. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలగాలి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచనలు చేస్తుండాలి... -
ఓటర్లకు ఎన్ని కష్టాలో..
[ 12-05-2024]
రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా కుటుంబాలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్లకు పయనమయ్యారు. -
మొదటి ఓటు పార్లమెంటు అభ్యర్థికే...!
[ 12-05-2024]
తాజా ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో పౌరులు ఎక్కువగా తికమక పడే వీలుంది. తాను వేయాల్సిన వ్యక్తికో.. పార్టీకో సక్రమంగా ఓటు వేయడంలో కొంత గందరగోళానికి గురవుతుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్
-
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
-
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి