బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు.
జనంపై జగన్ ఛార్జీల కొరడా
నష్టాల పేరుతో ఓసారి, డీజిల్ సెస్సు అంటూ రెండు దఫాలు
ఈనాడు, అమరావతి
పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్ మీద షాక్లిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెంచేసిన జగన్ సర్కారు.. ఆ తరువాత కొవిడ్ ఉద్ధృతి నుంచి జనం కోలుకుంటుండగానే మరో దెబ్బ కొట్టింది. వెనువెంటనే రెండుసార్లు ఛార్జీలను పెంచేసింది. అసలే ధరల మంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు ఈ భారాన్ని తట్టుకోలేకపోయారు. ప్రయాణించే దూరం పెరిగే కొద్దీ ఛార్జీలు ఎక్కువయ్యాయి. ఫలితంగా దూరప్రాంత సర్వీసుల్లో ప్రయాణమంటేనే జనం భయపడిపోయే పరిస్థితి.
పది కిలోమీటర్లలోపు ప్రయాణాన్ని మినహాయించి... రెండు స్టేజీలు దాటిన తర్వాత రూ. 5 పెంచారు. 75 కిలోమీటర్ల వరకు ఇదే పెంపు వర్తింపజేశారు. ఇంద్ర, గరుడ, అమరావతి సర్వీసులకు కిలోమీటరుకు 10 పైసలు, ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచారు.
రెండు జిల్లాల్లో ఏటా రూ. 372 కోట్ల మేర వడ్డన
డీజిల్ సెస్సు పేరుతో జగన్ సర్కారు ఛార్జీలు పెంచింది. గతానికి భిన్నంగా కిలోమీటరు ప్రాతిపదికన కాకుండా టిక్కెట్పై బస్సును బట్టి రూ. 5 నుంచి రూ. 15 వరకు పెంచారు. అధికారులు చెప్పిందొకటి.. పెంచింది మరోలా. అప్పటివరకు పల్లెవెలుగు బస్సులపై ఏ రకమైన సెస్సూ లేదు. కొత్తగా డీజిల్ సెస్సు పేరుతో పాటు ప్యాసింజర్, భద్రత సెస్సులను కూడా మోపారు.
ఛార్జీలను పెంచిన రెండున్నర నెలలకే డీజిల్ సెస్సు పేరుతో మళ్లీ జనంపై పిడుగు పడింది.. సర్వీసునుబట్టి ధరలను నిర్ణయించింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులకు రూ. 10, ఎక్స్ప్రెస్లకు రూ. 20, ఆల్ట్రా డీలక్స్లకు రూ. 25, సూపర్ లగ్జరీలకు రూ. 40గా కనీస ఛార్జీలను సవరించింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులకు కలిపే కనీస ధరను నిర్ణయించారు. మిగిలిన వాటిపై అదనంగా సెస్సు, ఇతర పన్నులు వేశారు.
ప్రాణాలతో చెలగాటం
జగన్ హయాంలో ఆర్టీసీలో కొత్త బస్సుల ఊసే లేదు. పాతవాటికే పైపై మరమ్మతులు చేసి నడుపుతున్నారు. దీనివల్ల అవి ఎక్కడికక్కడ మొరాయించడమే కాదు.. ప్రమాదాలకు గురవుతున్నాయి. విడిభాగాల కొరత వేధిస్తున్నా.. అరకొరగానే మరమ్మతులు చేసి రోడ్ల మీదకు వదులుతున్నారు. వీటిని పూర్తిగా తీసేయాలన్నా.. తొలగించలేని పరిస్థితి. కొత్త నిబంధనల కారణంగా ఒకేసారి ఎక్కువ బస్సులను తుక్కు చేయాల్సి వస్తోంది. పక్కన పెట్టాల్సిన వాహనాల స్థానంలో ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి కొన్ని బస్సులను రప్పించి సర్దుబాటు చేశారు. ఇవి కూడా ఎక్కువ కిలోమీటర్లు తిరిగినవే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా చాలా బస్సులను స్క్రాప్నకు పంపాల్సి వచ్చింది. రెండు జిల్లాల్లోని చాలా డిపోల్లో దాదాపు 50 బస్సులు మరమ్మతులకు అవకాశం లేక తుక్కు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఆదేశాలిచ్చారు. వీటిని తెచ్చి 15 సంవత్సరాలు నిండకపోయినా.. వాటి పరిస్థితి సరిగా లేక ఈ నిర్ణయం తీసుకున్నారు.
బస్పాస్పై రూ.5000
-రవితేజ, తేలప్రోలు, ఉంగుటూరు మండలం
2019లో బీటెక్లో చేరా. అప్పుడు త్రైమాసిక బస్పాస్ తేలప్రోలు నుంచి విజయవాడకు రూ.1500. ప్రస్తుతం రూ.1800 చేశారు. నెలకు రూ.5 వేలు అదనపు భారం పడింది. దీనివల్ల ఇంట్లో బడ్జెట్ తలకిందులైంది. జగన్ హామీకి ఆయనే తూట్లు పొడవడం దారుణం.
ఇలా పెంచడం ఇబ్బందికరమే..
-ఎస్.కల్యాణ్, బీసీఏ ఫైనలియర్
ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపాలెం నుంచి నగరంలోని కొత్తపేట కళాశాలకు వస్తాను. మూడేళ్లుగా కళాశాలకు వచ్చి వెళ్తున్నా. ప్రస్తుతం 3 నెలలకు బస్పాస్ రూ.940లు ఖర్చవుతోంది. గతంలో ఇదే 3 నెలలకు రూ.540లు అయ్యేది. ఈ ప్రభుత్వం విద్యార్థుల బస్ పాస్లు సైతం వదలకుండా ఛార్జీలు పెంచి మాపై భారం మోపింది. ఇలా పెంచడం ఇబ్బందికరమే. విద్యార్థులకు ఉచితంగా పాస్ ఇచ్చేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల అంధకారం..
[ 12-05-2024]
ఐదేళ్ల చీకటి యుగాన్ని తలచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసి.. వ్యవస్థలన్నిటినీ కూలదోసి.. బానిస యుగాన్ని తలపించేలా సాగిన సీఎం జగన్ పాలన రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు వెనక్కి నెట్టేసింది. -
కన్నేస్తే.. కైవసాలే..!
[ 12-05-2024]
జాతీయ నేతలకు జన్మనిచ్చిన ప్రాంతమది. సంస్కృతీ సాహితీ రంగాల ప్రముఖులను జాతికందించిన పవిత్ర భూమి. ప్రత్యేక నృత్య రీతులకు పేరెన్నికగన్న కూచిపూడి నృత్యం పుట్టిన గడ్డ. ఆ నేలపై కాలుమోపితే చాలు. -
కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. -
ఖాకీ కళ్లకు వైకాపా గంతలు!
[ 12-05-2024]
వందలకొద్దీ సంచార బలగాలు.. విస్తృత బందోబస్తు.. ఎక్కడికక్కడ నిఘా.. సీసీ కెమెరాల పహారా.. ఇవేవీ వైకాపా నేతలకు అడ్డు కాలేదు. -
వెల్లువై రావాలి.. విల్లుపై సాగాలి!
[ 12-05-2024]
: ‘ఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కానీ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలోనూ.. చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకే.. మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం చేజారిపోతోంది. -
‘ఆనకట్ట’లేకపోయారు
[ 12-05-2024]
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది జలాలు సముద్రంలో కలిసిపోకుండా నిలువరిస్తాం -
ఆగని మట్టి మాఫియా ఆగడాలు
[ 12-05-2024]
ఏటా వేసవి రాగానే గుడివాడ ప్రాంతంలో ఎమ్మెల్యే కొడాలి నాని కనుసన్నల్లో మట్టి మాఫియా అయిదేళ్లుగా రెచ్చిపోతోంది. -
జీవాలపైనా జాలి లేదా.. జగన్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ పశువైద్య కేంద్రా(ఆర్ఎల్యూ)ల్లో 50 శాతానికి పైగా శిథిలావస్థలో ఉన్నాయి. 75 శాతం వీడీలు(వెటర్నరీ డిస్పెన్సరీ)లో కనీస వసతులు లేవు. మండల స్థాయిలో ఆర్ఎల్యూలు సరాసరిన ఆరు, వీడీలు రెండు చొప్పున ఉన్నాయి. -
మెట్రో రైలుకు జగన్ ఉరి!
[ 12-05-2024]
పాలకులకు దూరదృష్టి ఉండాలి.. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలగాలి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచనలు చేస్తుండాలి... -
ఓటర్లకు ఎన్ని కష్టాలో..
[ 12-05-2024]
రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా కుటుంబాలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్లకు పయనమయ్యారు. -
మొదటి ఓటు పార్లమెంటు అభ్యర్థికే...!
[ 12-05-2024]
తాజా ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో పౌరులు ఎక్కువగా తికమక పడే వీలుంది. తాను వేయాల్సిన వ్యక్తికో.. పార్టీకో సక్రమంగా ఓటు వేయడంలో కొంత గందరగోళానికి గురవుతుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు