logo

అభివృద్ధికి బాటలు వేద్దాం రండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్‌, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 29 Apr 2024 04:44 IST

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కాలనీలను అభివృద్ధి పరిచేందుకు బాటలు వేద్దామని, అందరూ కలిసి రావాలని కూటమి విజయవాడ ఎంపీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని శివనాథ్‌, సుజనా చౌదరిలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం పాతబస్తీ పాతరాజరాజేశ్వరీపేట జనప్రియ అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు రాజధానిగా అమరావతి రూపాంతరం చెందుతుంటే జగన్‌మోహన్‌రెడ్డి కావాలనే చంపేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన  అనుభవాన్ని నియోజకవర్గం అభివృద్ధికి వినియోగించుకునేలా చేస్తానని సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం పశ్చిమ నియోజకవర్గం ప్రజల అదృష్టమని కేశినేని శివనాథ్‌ అన్నారు. పాతరాజరాజేశ్వరీపేట వాసుల కష్టాలను తీర్చే బాధ్యత తనదని తెలిపారు. కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్‌, ధనేకుల వెంకట సబ్బారావు, పైలా సోమినాయుడు, మురుగుర్తి ఈశ్వర్‌, సయ్యద్‌ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని