కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక రేవుల్లో గుత్తేదారుల ఇష్టారాజ్యం
యంత్రాల వినియోగంతో వీధిన పడిన కుటుంబాలు
న్యూస్టుడే, లంకపల్లి(పమిడిముక్కల)
కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి రేవులో నిత్యం 150 మందికి తక్కువలేకుండా ఒక్కొక్కరికి రూ.1,500 కూలికి పని చేసేవారమని లంకపల్లి పరిసరగ్రామాల కార్మికులు తెలిపారు. వర్షాకాలం పోనూ 300 రోజులు పనిచేసినా మొత్తం మీద సుమారు రూ.7 కోట్లకుపైగా ఇక్కడి కార్మికులకు దక్కేదని తెలిపారు. శ్రీకాకుళం, తోట్లవల్లూరు రేవులపై ఇంకా అధికంగా కార్మికులు ఆధారపడి ఉన్నామన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమపై ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుత్తేదారులు పదుల సంఖ్యలో యంత్రాలు ఉపయోగిస్తూ తమ పొట్ట కొట్టారని కార్మికులు ఆందోళన నిర్వహిస్తే పోలీసులతో తమను అడ్డుకున్నారని అప్పారావుపేటకు చెందిన కార్మికులు పేర్కొన్నారు. కలెక్టర్లకు, గనుల శాఖ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా కనికరించలేదని.. చివరికి ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ను ప్రాధేయపడినా ఆ విషయం మర్చిపోండని సమాధానమిచ్చారని, కాదని ముందుకెళ్తే కష్టాల్లో పడతారని స్థానిక నాయకులు హెచ్చరించారని వాపోయారు. గుత్తేదారులు యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తోడేసి పెద్ద గుంతలు చేశారని ఆరోపించారు. గతంలో నదిలోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలించేందుకు అనుమతులుండేవని, ఇప్పుడు నదిలోకి ట్రాక్టర్లు దిగకుండా కట్టడిచేసి వారి కడుపు కొట్టారని ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. తాజాగా తమకు తాత్కాలిక తాయిలాలు చూపించి ఓట్ల కోసం తిరుగుతున్నారని, వాటి కోసం ఆరాటపడితే ఎనిమిది నెలలపాటు పనులు దొరక్క కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇసుక కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్ముకున్న ప్రభుత్వమే నట్టేట ముంచింది
- ఇసుక కార్మికుడు
కార్మికుల బతుకులు బాగుచేస్తామన్న వైకాపా నాయకుల మాటలు నమ్మి గెలిపిస్తే మా బతుకులను నట్టేట ముంచారు. నాలుగేళ్లుగా రేవులోకి అడుగెట్టనీయకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారులకే అధికారులు, ప్రభుత్వం వంతపాడింది. ఫలితంగా పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. పిల్లల చదువులకు, కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు అప్పులపాలయ్యాను. ఉపాధి చూపే ప్రభుత్వం వస్తేనే మా బతుకు బండి సాగుతుంది.
కార్మికుల కడుపు కొట్టారు
- ఇసుక కార్మికుల సంఘం నాయకుడు
సంస్కరణలంటూ ప్రభుత్వం కార్మికుల ఉపాధి పోగొట్టడంతో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది.. లంకపల్లి, శ్రీకాకుళం రేవుల్లో వందలాది కార్మికులు పని చేసి కుటుంబాలను పోషించుకునేవారు. గుత్తేదారులు కార్మికుల పొట్ట కొడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కిమ్మనకపోవటం శోచనీయం. కార్మికులకు అవకాశం ఇచ్చే ప్రభుత్వాల కోసం ఎదురుచూస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6గంటల వరకు అవకాశం.. మిస్ కావొద్దు: ఓటర్లకు చంద్రబాబు విజ్ఞప్తి
[ 13-05-2024]
రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓట్లు వేసిన వారికి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అరాచకం
[ 13-05-2024]
పోలింగ్ వేళ కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. -
వైకాపా దారుణాలపై పోలీసులు చర్యలు తీసుకోట్లేదు.. ఈసీకి భాజపా ఫిర్యాదు
[ 13-05-2024]
ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా దారుణాలపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. -
తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఈసీ
[ 13-05-2024]
గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. -
నీదే రోజు.. నీవే రాజు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లాలో 17.04 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 1,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,402 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. -
ఓటుకు సొంతూరిబాట
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబాలతో సహా స్వగ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో విజయవాడలోని పండిట్నెహ్రూ బస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. -
నేత్రపర్వం.. ఆదిశంకరాచార్యుని జయంతి
[ 13-05-2024]
ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర యంత్రాన్ని పతిష్ఠించిన ఆదిశంకరాచార్యుల జయంతిని నేత్రపర్వంగా రుత్వికులు ఆదివారం నిర్వహించారు. -
నోట్ల కట్టలతో ‘దండయాత్ర’
[ 13-05-2024]
మేం మీకు వేయమా? మాకెందుకు డబ్బులివ్వటం లేదు. మేమేం చేశాం. అందరికీ ఇచ్చి మాకివ్వటం లేదు. -
తెదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రంలో సంతకాలు చేసేందుకు వెళ్లిన తెదేపా ఏజెంట్పై వైకాపా వర్గీయులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు. -
ఎమ్మెల్సీ రుహుల్లాపై కేసు
[ 13-05-2024]
అజిత్సింగ్నగర్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద ఓటుకు రూ.1000లు పంచుతున్నారంటూ ములుగూరి గోపాల్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్సింగ్నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు -
లేలే.. ఇవ్వాళే.. లేలే
[ 13-05-2024]
‘ఈ ఎన్నికల్లో మా ఓటు ఎంత కీలకమో తెలుసు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే.. అభివృద్ధికి కట్టుబడి ఉండే నేతలను ఎన్నుకోవాలని.. సముద్రాలు దాటి మరీ వచ్చాం. -
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేద్దాం
[ 13-05-2024]
ప్రజాస్వామ్యానికి పండగ లాంటి పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేద్దామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. -
ఓటును గెలిపిద్దాం.. చేటును తరిమేద్దాం
[ 13-05-2024]
జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. -
కాల్చుకు తిన్నోళ్లను.. కాల్చిపారేయండి!
[ 13-05-2024]
తెలుగు జాతి వెలగాలని.. తరతరాలు మురవాలని! సిరుల మాగాణం కంటే.. సరిలేని ఆంధ్రమే మిన్నయని.. లక్షల ఉద్యోగాల కల్పనకు.. లక్ష కోట్ల సంపద సృష్టికి ఊపిరిలూదారు
తాజా వార్తలు (Latest News)
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి