బుద్ధవిహార్కు వైకాపా గ్రహణం
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు.
నిధులు విదల్చని పర్యాటక శాఖ
అయిదేళ్లలో ఒక్కసారీ సందర్శించని మంత్రి
న్యూస్టుడే, ఘంటసాల
బుద్ధవిహార్.. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఘంటసాలలో తలపెట్టిన ఈ పర్యాటక ప్రాజెక్టు నిర్మాణ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలో చకచకాసాగాయి. దాదాపు రూపురేఖలు వచ్చాయనుకునే సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి.
నేడు ఇలా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు విదల్చకపోవడంతో పనునలు సగంలో ఆగిపోయి నిర్మాణ ప్రాంతం వెలవెలబోతోంది. పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రోజారెడ్డి అయిదేళ్లలో ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించకపోగా నిధులు కేటాయించలేదు. ఎమ్మెల్యే సంహాద్రి రమేష్బాబు కూడా పట్టించుకోకపోవడంతో సగంలో ఆగిపోయి బౌద్ధ భిక్షువుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది.
ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయుడు గొర్రెపాటి రంగనాథబాబు 2 ఎకరాల వ్యవసాయ భూమిని పర్యాటక శాఖకు విరాళంగా రాసిచ్చారు. ఈ స్థలంలో 2017లో నాటి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, అప్పటి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, నాటి ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎన్నారై రంగనాథబాబు, స్థానిక బౌద్ధభిక్షువు ధర్మదజ బంతేజితోపాటు దేశ విదేశాల నుంచి 200 మందికిపైగా బౌద్ధ భిక్షువులు విచ్చేసి బౌద్ధ సంప్రదాయాలతో బుద్ధ విహార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
శయన బుద్ధుని భారీ విగ్రహంతో..
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ఉన్న హయాంలో హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో నిలువెత్తు బుద్ధుని విగ్రహం, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ధ్యాన బుద్ధుడి విగ్రహం నెలకొల్పారు. అదే తరహాలో ఒకప్పటి ప్రముఖ ఓడరేవు ఘంటసాలలో 100 అడుగులు శయన బుద్ధుడు భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు. బౌద్ధులకు ధ్యాన మందిరంతోపాటు బౌద్ధ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పనులు పడకేశాయిలా..
2019 ఎన్నికలకు ముందు బుద్ధవిహార్ రెండంతస్తుల భవనం శ్లాబు పనులు శరవేగంగా సాగాయి. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులన్నీ నిలిపివేశారు. పర్యాటక శాఖ మంత్రి రోజారెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పట్టించుకున్న దాఖలు లేవు. ఐదేళ్లుగా నిధులు విదల్చకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన తయారైంది. బౌద్ధవిహార్ ప్రాంగణంలో శిలాఫలకం శిథిలమైంది. భవనాల శ్లాబులకు వినియోగించిన యంత్రం తుప్పు పట్టి పాడైంది. భవనం ముందు ఎత్తైన ఇనుప చువ్వలు వానకు తడిసి ఎండకు ఎండుతున్నాయి. ముళ్లచెట్లు, పిచ్చి మొక్కలతో ఈ ప్రాంగణం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. బుద్ధవిహార్ నిర్మాణం పూర్తయితే దేశ, విదేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులతోపాటు, పర్యాటకులకు ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందోనని జిల్లా ప్రజలతోపాటు బౌద్ధభిక్షువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటరులోనూ కనిపించింది: చంద్రబాబు
[ 13-05-2024]
పోలింగ్ సరళిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. -
ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
[ 13-05-2024]
ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. ఈ సంకల్పం రాష్ట్రానికి మేలు చేస్తుంది: చంద్రబాబు
[ 13-05-2024]
రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓట్లు వేసిన వారికి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అరాచకం
[ 13-05-2024]
పోలింగ్ వేళ కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. -
వైకాపా దారుణాలపై పోలీసులు చర్యలు తీసుకోట్లేదు.. ఈసీకి భాజపా ఫిర్యాదు
[ 13-05-2024]
ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా దారుణాలపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. -
తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఈసీ
[ 13-05-2024]
గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. -
నీదే రోజు.. నీవే రాజు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లాలో 17.04 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 1,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,402 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. -
ఓటుకు సొంతూరిబాట
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబాలతో సహా స్వగ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో విజయవాడలోని పండిట్నెహ్రూ బస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. -
నేత్రపర్వం.. ఆదిశంకరాచార్యుని జయంతి
[ 13-05-2024]
ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర యంత్రాన్ని పతిష్ఠించిన ఆదిశంకరాచార్యుల జయంతిని నేత్రపర్వంగా రుత్వికులు ఆదివారం నిర్వహించారు. -
నోట్ల కట్టలతో ‘దండయాత్ర’
[ 13-05-2024]
మేం మీకు వేయమా? మాకెందుకు డబ్బులివ్వటం లేదు. మేమేం చేశాం. అందరికీ ఇచ్చి మాకివ్వటం లేదు. -
తెదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రంలో సంతకాలు చేసేందుకు వెళ్లిన తెదేపా ఏజెంట్పై వైకాపా వర్గీయులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు. -
ఎమ్మెల్సీ రుహుల్లాపై కేసు
[ 13-05-2024]
అజిత్సింగ్నగర్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద ఓటుకు రూ.1000లు పంచుతున్నారంటూ ములుగూరి గోపాల్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్సింగ్నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు -
లేలే.. ఇవ్వాళే.. లేలే
[ 13-05-2024]
‘ఈ ఎన్నికల్లో మా ఓటు ఎంత కీలకమో తెలుసు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే.. అభివృద్ధికి కట్టుబడి ఉండే నేతలను ఎన్నుకోవాలని.. సముద్రాలు దాటి మరీ వచ్చాం. -
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేద్దాం
[ 13-05-2024]
ప్రజాస్వామ్యానికి పండగ లాంటి పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేద్దామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. -
ఓటును గెలిపిద్దాం.. చేటును తరిమేద్దాం
[ 13-05-2024]
జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. -
కాల్చుకు తిన్నోళ్లను.. కాల్చిపారేయండి!
[ 13-05-2024]
తెలుగు జాతి వెలగాలని.. తరతరాలు మురవాలని! సిరుల మాగాణం కంటే.. సరిలేని ఆంధ్రమే మిన్నయని.. లక్షల ఉద్యోగాల కల్పనకు.. లక్ష కోట్ల సంపద సృష్టికి ఊపిరిలూదారు
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM