logo

గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని

గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 19 Apr 2024 03:45 IST

ఎస్‌.మల్లాపురంలో విజయ చిహ్నం చూపుతున్న అమిలినేని సురేంద్రబాబు

కుందుర్పి, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. కుందుర్పి మండలం ఎస్‌.మల్లాపురం, తెనగల్లు, కరిగానిపల్లి, కృష్ణాపురం, తూమకుంట గ్రామాల్లో గురువారం సాయంత్రం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. తెనగల్లులో వైకాపాకు చెందిన పలు కుటుంబాల నాయకులు అమిలినేని సమక్షంలో తెదేపాలో చేరారు. ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మండల తెదేపా అధ్యక్షుడు ధనుంజయ, తూమకుంట, కరిగానిపల్లి సర్పంచులు రామాంజనేయులు, నాగేంద్ర, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లికార్జున, క్లష్టర్‌ ఇన్‌ఛార్జి ప్రసాద్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని