ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు.
మార్కెట్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చి వంచించిన జగన్
కర్ణాటక ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను
గౌడనకుంటలో సాగుచేసిన వక్కతోట
మడకశిర, అమరాపురం, న్యూస్టుడే: వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం 220 ఎకరాలు, రాయదుర్గం 150, హిందూపురం 100, మడకశిర 3,200 మొత్తం 3,670 ఎకరాల్లో వక్క సాగులో ఉంది. ఏడాదికి దాదాపు 18 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు విలువ చేసే క్రయ, విక్రయాలు సాగుతున్నాయి. ఒక్కసారి సాగుచేస్తే వందేళ్ల వరకు దిగుబడి ఇవ్వడం ఈ పంట ప్రత్యేకత.
సీఎం హామీకి ఐదేళ్లు..
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో మడకశిరకు వచ్చి వక్క రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాలన ముగుస్తున్నా.. ఒక్కసారీ ఇటు చూడలేదు. మార్కెట్ ఊసే లేదు. ఇక్కడ పండించిన వక్కకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కర్ణాటకలోని భీమసముద్రం, శిర, తుమకూరు, దావణగెర తదితర మార్కెట్లకు 160 నుంచి 200 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలతో రవాణా చేసి అమ్ముకుంటున్నారు. రైతులకు ఇబ్బందులతోపాటు పన్ను రూపంలో రూ.15 కోట్లకు పైగా ఆదాయం కర్ణాటక రాష్ట్రానికి వెళుతోంది. తెదేపా ప్రభుత్వంలో అమరాపురం మండల కేంద్రంలో 5 ఎకరాల్లో మార్కెట్ నిర్మించేందుకు స్థల పరిశీలన చేసి రూ.3.5 కోట్ల నిధులు కూడా మంజూరు చేసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిధులు కాస్త వెనక్కి వెళ్లాయి.
రైతులు ఎండబెట్టిన వక్క
గోదాములు లేక ఇళ్లల్లోనే సరకు
రైతులు పంటను నిల్వ చేసుకోవడానికి ప్రత్యేకంగా గోదాములు నిర్మించకపోవడంతో ఇళ్లల్లోనే రూ.కోట్ల విలువ చేసే సరకు నిల్వ చేసుకుంటున్నారు. ప్రధానంగా తెదేపా హయాంలో రైతుబంధు పథకం అమలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతులు ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని రూ.2 కోట్ల వరకు వడ్డీలేని రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రైతుబంధు అమలు కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి వచ్చినకాడికి విక్రయించుకోవాల్సి వస్తోంది. అలా ఇప్పటి వరకు దాదాపు రూ.4 కోట్ల వరకు మోసపోయారు.
బోర్లలో తగ్గుతున్న నీటి మట్టం
హంద్రీనీవా కాలువల ద్వారా నీరు రాకపోవడంతో చెరువుల్లో జలాలు లేక బోర్లు ఎండిపోతున్నాయి. పంట ఎండుముఖం పట్టి దిగుబడి తగ్గుతోంది. ప్రభుత్వం ఐదేళ్లుగా కాలయాపన చేసిందే తప్ప నీరు అందించడానికి చర్యలు తీసుకోలేదు. 8 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఏటా రూ.30 క్వింటాళ్ల ఎండిన వక్క దిగుబడి వస్తున్నా.. ఒక్కోసారి గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతుల్లో మోసపోతుండటంతో నష్టపోతున్నాం. కూలీల ధరలు అధికంగా ఉన్నందున ఈ పంటను ఉపాధిహామీకి అనుసంధానం చేస్తే బాగుంటుంది.
రామలింగప్ప, గౌడనకుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు