ఐదేళ్లు.. రూ.600 కోట్లు
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది.
భూవిలువలు పెంచి ఉమ్మడి జిల్లా ప్రజలపై ఆర్థిక భారం మోపిన జగన్
వైకాపా పాలనలో స్టాంపులకూ తప్పని తిప్పలు
తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్టుడే: ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. ఐదేళ్లలో ప్రత్యేక సవరణలతో కలుపుకొని ఐదుసార్లు పెంచింది. కరోనా లాక్డౌన్ తర్వాత 2021లో మాత్రమే భూముల విలువలను సవరించలేదు. భూములు కొనుగోలు చేసేవారిపై వైకాపా ప్రభుత్వం భారీగా ఆర్థిక భారం మోపింది. జాతీయ రహదారులు, పారిశ్రామికవాడలు, ప్రధాన కూడళ్లలో ఉన్న భూముల విలువలు ఐదేళ్లలో అమాంతంగా పెరిగాయి. కొన్నిచోట్ల 300 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కామధేనువు లాంటి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం రెట్టింపుగా పిండుకుంది. బహిరంగ మార్కెట్ను తలదన్నేలా ఏటా భారీగా పెంచడంతో క్రయవిక్రయాలు పడిపోయాయి.
రిజిస్ట్రేషన్శాఖ జిల్లా కార్యాలయం
- అనంతపురం గ్రామీణ మండలం సోమలదొడ్డిలో ఎకరా వ్యవసాయ భూమి విలువ ఏడాది కిందట రూ.8 లక్షల వరకు ఉండేది. అప్పట్లో ఎకరా భూమి క్రయవిక్రయాలు జరిగితే స్టాంపు డ్యూటీ, ప్రభుత్వ రుసుం కలిపితే రూ.60 వేల ఆదాయం రిజిస్ట్రేషన్శాఖ పద్దుకు జమయ్యేది. ఇందులో స్టాంపు డ్యూటీ కింద రూ.52 వేలు, ప్రభుత్వ రుసుం కింద రూ.8 వేలు కొనుగోలుదారు భరించేవారు. ఇవికాకుండా యూజర్ ఛార్జీలు రూ.వెయ్యి వరకు అదనంగా ఉండేవి.
- ప్రస్తుతం అదే గ్రామంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. వ్యవసాయ భూమి ఎకరా రూ. 8 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచింది. అంటే 275 శాతం పెంచింది. దీని ప్రకారం కొనుగోలుదారులు ప్రస్తుతం రూ.2.25 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భరిస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 60 వేల నుంచి రూ.2.25 లక్షలకు పెరిగాయన్నమాట. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఛార్జీలు పెంచారు. ఉమ్మడి అనంత జిల్లాలో భూముల విలువలు భారీగా పెరగడంతో ప్రజలపై ఐదేళ్లలో రూ.600 కోట్లకు పైగా భారం పడింది. స్వల్పం అంటూ ప్రజలను నమ్మించి గుట్టుగా భారీగా పెంచేశారు. ప్రభుత్వం బయటకు పొక్కకుండా భూముల విలువలు పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఐదేళ్లలో బహిరంగ మార్కెట్కు దీటుగా విలువలు పెంచిన ఘనత వైకాపాదేనని చెప్పవచ్చు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భూముల విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది. నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించిన దాఖలాలు లేవు.
స్వల్పమే అంటూ 275 శాతం వడ్డన
2019 ఆగస్టు 1న గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం తొలిసారిగా భూముల విలువ పెంచింది. 2020 ఆగస్టు 10న అర్బన్ ప్రాంతాల్లో పెంచింది. 2021లో కరోనా కారణంగా పెంపు జోలికి వెళ్లలేదు. 2022 జూన్ 1న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విలువలు సవరించారు. 2022 జూన్ 6న ప్రత్యేక సవరణ పేరుతో శ్రీసత్యసాయి జిల్లాలో పెంచారు. 2023 జూన్ 1న ప్రత్యేక సవరణ పేరుతో 30 నుంచి 275 శాతం వరకు భూముల విలువలు పెంచారు.
వినియోగదారుల బాధలు వర్ణనాతీతం
ఐదేళ్లలో స్టాంపుల కొరత ప్రజలను పట్టి పీడించింది. ప్రభుత్వం స్టాంపుల అమ్మకాలను పూర్తిగా ప్రైవేటు పరం చేసింది. నాసిక్ నుంచి కొనుగోలు చేయలేని ప్రభుత్వం ఈ-స్టాంపింగ్కు ద్వారాలు తెరిచింది. దీనివల్ల ప్రజలకు అదనపు భారం పడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్టాంపుల కోసం ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర జిల్లాల్లో ఉన్న స్టాంపులను ఇక్కడికి సరఫరా చేసి తాత్కాలికంగా ఉపశమనం చేశారు. అలాగే ప్రైమ్.2 సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ల శాఖకు పరిచయం చేయడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో సమస్యతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల దస్తావేజు చేతికి అందాలంటే నెలల సమయం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షంతో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు