సీఎం రాగానే.. జనం జారుకున్నారు
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు.
ప్రసంగం తేలిపోవడంతో కార్యకర్తల అసంతృప్తి
ఆత్మస్తుతి, పరనిందతోనే సరిపెట్టిన జగన్
జగన్ మాట్లాడుతున్న సమయంలో ఇంటి దారి పట్టిన వైకాపా కార్యకర్తలు
ఈనాడు డిజిటల్, అనంతపురం- న్యూస్టుడే, తాడిపత్రి, తాడిపత్రి పట్టణం: తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా మొదలుపెట్టడంతో సభకు వచ్చిన జనం మొదట్లోనే జారుకున్నారు. పది నిమిషాల్లోనే సగానికి పైగా వెళ్లిపోయారు. ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోను జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం. తనను తాను పొగుడుకోవడం.. చంద్రబాబు, పవన్కల్యాణ్లను తిట్టడానికే పరిమితమయ్యారు. ఐదేళ్లలో ఎన్ని బటన్లు నొక్కారు? ఎంతమంది ఖాతాలో నగదు జమ చేశారో వంటి అంశాలు మినహా కొత్తగా ఏమీ మాట్లడలేదు. ఎక్కడా అనంత జిల్లా పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
యల్లనూరు రోడ్డు బైపాస్లో ఓవైపు రాకపోకలు నిలిపివేత
ఫ్యాక్షన్ మొదలుపెడతానన్న ఎమ్మెల్యే మంచివాడా?
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి సీఎం మాట్లాడుతూ... మాట కొంచెం కఠినం కానీ.. మనిషి చాలా మంచివాడు అంటూ పొగిడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఐదేళ్లలో వ్యవహరించిన తీరు తాడిపత్రితో పాటు జిల్లా మొత్తానికి తెలుసు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానని బహిరంగంగా చెప్పిన ప్రజాప్రతినిధిని మంచివాడంటూ ఎలా చెబుతారని స్థానికులు నిలదీస్తున్నారు. గంటన్నర ఆలస్యంగా తాడిపత్రి సభాప్రాంగణానికి చేరుకున్న జగన్.. హడావుడిగా ప్రసంగాన్ని ముగించారు. జనం పెద్దగా రాకపోవడంతో.. కప్పిపుచ్చేందుకు వైకాపా నాయకులు నానాతంటాలు పడ్డారు. సభకు వచ్చిన వారికి మందు, బిర్యానీతో పాటు రూ.500 డబ్బులు పంపిణీ చేశారు.
తాడిపత్రిలో దుకాణ సముదాయాల మూసివేత
అడుగు పెట్టాడంటే కష్టాలే..
సీఎం జగన్ పర్యటనతో తాడిపత్రి వాసులకు కష్టాలు తప్పలేదు. పుట్లూరు రోడ్డు నుంచి పోలీస్స్టేషన్ సభా ప్రాంగణం వరకు సుమారుగా వంద చెట్ల కొమ్మలు తొలగించారు. కాన్వాయ్కు అడ్డుగా ఉన్నాయని ఏకంగా విద్యుత్తు తీగలను తొలగించారు. టైలర్స్కాలనీ, కృష్ణాపురం రోడ్డు, రెడ్డివారిపాలెం పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వేసవి తాపానికి తట్టుకోలేక పట్టణవాసులు అవస్థలు పడ్డారు. పోలీసుల ఆంక్షలతోనూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టీసీ బస్సులను బైపాస్ నుంచి మళ్లించడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రయాణికులను దింపేశారు. యల్లనూరు రోడ్డు నుంచి అశోక్పిల్లర్ వరకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. పుట్లూరు రోడ్డు, సభా ప్రాంగణంలో దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఆఖరికి మందుల దుకాణాలనూ బంద్ చేయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పోలీసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సుమారు 2 వేల మంది పోలీసుల్ని బందోబస్తుకు కేటాయించారు. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అమిత్ బర్దార్ స్వయంగా బందోబస్తు పర్యవేక్షించడం గమనార్హం.
రెడ్డివారిపాళెం దారిలో తొలగించిన విద్యుత్తు తీగలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ