ఈవీఎంలపై అపోహలు వద్దు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు.
కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు
రాప్తాడు: పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్కుమార్
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ రెవెన్యూ భవన్లో ఈవీఎంలపై రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, ప్రధాన ఏజెంట్లు హాజరయ్యారు. అక్కడే ఈవీఎంల భద్రత, పనితీరు, పారదర్శకతపై ఈఎంఎస్ 2.0 సాఫ్ట్వేర్లో ఆన్లైన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలు ఏయే పోలింగ్ కేంద్రాలకు కేటాయించామన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎవరూ ఏ దశలోనూ అనుమానం, అపోహ పడొద్దన్నారు. ప్రతీది పక్కాగా సాగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చును రోజూ లెక్కించాలి.. అప్పటికప్పుడే నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేయాలి. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వ్యయ పరిశీలకుడు విలాస్ వి.షిండే పేర్కొన్నారు.
అదనంగా 1523 ఈవీఎంలు
అనంత జిల్లాలో లోక్సభ, తాడిపత్రి అసెంబ్లీ స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో ఈవీఎంల కొరత ఏర్పడింది. లోక్సభకు 21 మంది, తాడిపత్రి స్థానానికి 18 మంది ప్రకారం పోటీలో ఉన్నారు. ఇక్కడ రెండేసి ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అందుకే సత్వరమే అదనంగా మరో 1523 ఈవీఎం, కంట్రోల్ యూనిట్లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొరుగు జిల్లాలైన కడప నుంచి 470, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 1053 ప్రకారం అదనంగా ఈవీఎం, సీయూలను తెప్పిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
రాప్తాడు: అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం రాప్తాడు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను, బుధవారం సహాయ కలెక్టర్ వినూత్నతో కలిసి అనంత నగరంలోని పలు పోలింగు కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ రోజు ఓటు వేయడం అత్యంత కీలకమని, అందరూ ఓటువేసేందుకు ముందుకు రావాలని.. బీఎల్వోలకు ఓటర్లందరూ తెలిసి ఉండాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం