బ్రహ్మోత్సవంఏకాంతమేనా
శ్రీకాళహస్తి కరోనా రెండు దశల్లోనూ ముక్కంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, వార్షికోత్సవాలకు నెల రోజులే గడువు ఉండటంతో ఈ ఏడాది వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి ఇస్తే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్న తలంపుతో అధికారులున్నారు
పనుల ప్రారంభంపై సందిగ్ధం
న్యూస్టుడే, శ్రీకాళహస్తి కరోనా రెండు దశల్లోనూ ముక్కంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, వార్షికోత్సవాలకు నెల రోజులే గడువు ఉండటంతో ఈ ఏడాది వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి ఇస్తే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్న తలంపుతో అధికారులున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 24న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి వార్షిక ఉత్సవాలు ప్రారంభించాల్సి ఉంది. సాధారణంగా కనుమ పండుగ పూర్తయ్యాక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ పనులు ప్రారంభించేవారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో బహిరంగ ఉత్సవాలు నిర్వహించవద్దంటూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
రూ.2.5 కోట్ల బడ్జెట్ : ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ రూ.2.5 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మరింత ఎక్కువ నిధులు సమకూర్చుకునే అవకాశంతో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఏకాంతంగా జరపాల్సి వస్తే చేయాల్సిన పనులకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో నెల రోజులకు పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అధికారగణం భావిస్తోంది. ఇంజినీరింగ్ శాఖ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు : బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు టెండర్ల నిర్వహణ పూర్తయింది. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చి పనుల నిర్వహణకు ఆమోదం తెలిపితే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. - వెంకటనారాయణ, ఈఈ, శ్రీకాళహస్తీశ్వరాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మాటలు వినని జనం..!
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుత్తూరులో నిర్వహించిన సభకు జనాలు అంతంతమాత్రంగానే వచ్చారు. వచ్చిన జనాలు సైతం జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఇష్టపడలేదు. -
చంద్రబాబు శ్రీకారం.. జగన్ నిర్వీర్యం
[ 11-05-2024]
ప్రజాప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసింది.. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది.. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత: కలెక్టర్
[ 11-05-2024]
సమస్యాత్మిక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామని; ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సూచించారు. -
బాబు సూపర్-6 పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
[ 11-05-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లింది. కూటమి అధికారంలోకి వస్తే అజెండాలో ప్రకటించిన పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. -
దోచుకున్న సొమ్మేగా.. కొనేద్దాం..!
[ 11-05-2024]
అధికారాన్ని కాపాడుకునేందుకు వైకాపా పడరాని పాట్లు పడుతోంది. తమ అభ్యర్థులు పేదలు, సామాన్యులు.. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూనే.. -
తెదేపాకు అనుకూలమా.. ఆపేయ్..!
[ 11-05-2024]
పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి విషయంలో అంతా సమానంగా ఉండాలి.. కానీ వైకాపాకు మాత్రం ఈ సిద్ధాంతం వర్తించదేమో అనిపించేలా పాలన సాగించారు.. -
ప్రలోభాలు ప్రారంభం.. ఇంటింటికీ కోడి మాంసం.. మద్యం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -
కదిలింది.. తెలుగు మహిళా లోకం
[ 11-05-2024]
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు చిత్తూరులో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. -
నోటుకు లేదు ఢోకా.. మందుచుక్కే కరవైంది
[ 11-05-2024]
‘ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగం కోసం సిఫార్సు లేఖ ఇచ్చింది నేనే కదా.. ఎన్నికల సమయంలో వీలైనంతగా సరకు పంపించే బాధ్యత నీకు లేదా.. -
వైకాపా సర్పంచికి మహిళల దేహశుద్ధి
[ 11-05-2024]
వైకాపా సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. కుప్పం మండలం యమనాసనపల్లిలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా సర్పంచి సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. -
నాయకుల బైండోవర్లు దారుణం
[ 11-05-2024]
గత ఆరు నెలల్లో జిల్లాలో తెదేపా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు వాపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం