కష్టపడే ప్రతి కార్యకర్తకూ ప్రాధాన్యం
‘మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చుతున్నారు. మళ్లీ ఆయన్ను సీఎంను చేసేందుకు కృషి చేస్తామని
వైకాపా జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి
అభివాదం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి, శాసన సభ్యులు, నాయకులు
జీవకోన (తిరుపతి): ‘మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చుతున్నారు. మళ్లీ ఆయన్ను సీఎంను చేసేందుకు కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి’ అని వైకాపా జిల్లా అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. తిరుపతి తారకరామా మైదానంలో మంగళవారం ఆయన అధ్యక్షతన తిరుపతి జిల్లా వైకాపా ప్లీనరీ నిర్వహించారు. ప్రతి కార్యకర్తా పార్టీని జనంలోకి తీసుకుపోవాలని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు గగ్గోలు పెట్టినా.. మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రచారం చేసినా జనం ఆదరణ చూపుతున్నారని తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమానికి వస్తే జనం మాపై ఎలాంటి అభిమానం చూపుతున్నారో తెదేపా నాయకులకు తెలుస్తుందన్నారు. తిరుపతి జిల్లా పార్టీ ఇన్ఛార్జి ఆనం విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికతోపాటు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పార్టీకి ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే పవన్కల్యాణ్.. తాను తెదేపాతో భాగస్వామిగా ఉన్నప్పుడే రైతులకు రూ.23.45 కోట్లు బకాయిలు పెట్టారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్రావు మాట్లాడుతూ నవరత్నాల అమలులో భాగంగా సీఎం జగన్ కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టారని తెలిపారు. శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ తెదేపాది అంతా పబ్లిసిటీ అని, వారికి 99 శాతం మీడియా బలముందన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు ఇస్తున్నా వైకాపాకు పబ్లిసిటీ రావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, తిరుపతి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్రెడ్డి, ముద్ర నారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు శ్రీకారం.. జగన్ నిర్వీర్యం
[ 11-05-2024]
ప్రజాప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసింది.. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది.. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత: కలెక్టర్
[ 11-05-2024]
సమస్యాత్మిక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామని; ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సూచించారు. -
జగన్ మాటలు వినని జనం..!
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుత్తూరులో నిర్వహించిన సభకు జనాలు అంతంతమాత్రంగానే వచ్చారు. వచ్చిన జనాలు సైతం జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఇష్టపడలేదు. -
బాబు సూపర్-6 పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
[ 11-05-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లింది. కూటమి అధికారంలోకి వస్తే అజెండాలో ప్రకటించిన పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. -
దోచుకున్న సొమ్మేగా.. కొనేద్దాం..!
[ 11-05-2024]
అధికారాన్ని కాపాడుకునేందుకు వైకాపా పడరాని పాట్లు పడుతోంది. తమ అభ్యర్థులు పేదలు, సామాన్యులు.. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూనే.. -
తెదేపాకు అనుకూలమా.. ఆపేయ్..!
[ 11-05-2024]
పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి విషయంలో అంతా సమానంగా ఉండాలి.. కానీ వైకాపాకు మాత్రం ఈ సిద్ధాంతం వర్తించదేమో అనిపించేలా పాలన సాగించారు.. -
ప్రలోభాలు ప్రారంభం.. ఇంటింటికీ కోడి మాంసం.. మద్యం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -
కదిలింది.. తెలుగు మహిళా లోకం
[ 11-05-2024]
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు చిత్తూరులో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. -
నోటుకు లేదు ఢోకా.. మందుచుక్కే కరవైంది
[ 11-05-2024]
‘ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగం కోసం సిఫార్సు లేఖ ఇచ్చింది నేనే కదా.. ఎన్నికల సమయంలో వీలైనంతగా సరకు పంపించే బాధ్యత నీకు లేదా.. -
వైకాపా సర్పంచికి మహిళల దేహశుద్ధి
[ 11-05-2024]
వైకాపా సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. కుప్పం మండలం యమనాసనపల్లిలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా సర్పంచి సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. -
నాయకుల బైండోవర్లు దారుణం
[ 11-05-2024]
గత ఆరు నెలల్లో జిల్లాలో తెదేపా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు వాపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్