‘హమీ’తుమీ తేల్చవేం జగన్
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు.
మాట ఇచ్చి మడమ తిప్పడమే ఆయన నైజం
ఈనాడు-తిరుపతి: మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. అమలు కాని హామీలు ఎన్నైనా ఇస్తారు.. కానీ పనులు చేయరు. అమలు అసలే కనరు. ఎందుకంటే మడమ తిప్పడమే ఆయన నైజం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాలో పర్యటించిన పలు సందర్భాల్లో అనేక హామీలిచ్చినా ఒక్కటీ నెరవేర్చలేదు. పనులు చేపట్టేందుకు జిల్లాకు పైసా కేటాయించలేదు. ఎన్నికల వేళ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించేందుకు ఆదివారం ఆయన మరోసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ‘హామీ’తుమీ తేల్చాలని ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
తాత్కాలికంతో సరి..!
హామీ: ‘భారీ వర్షాలకు స్వర్ణముఖి నదిపై కూలిన వంతెనలు పునర్నిర్మిస్తాం.. పనులు పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ - పాపానాయుడుపేట, పాడిపేట ప్రాంతాల్లో ఇచ్చిన హామీ.
ప్రస్తుత స్థితి: కూలిన వంతెనలను పట్టించుకోలేదు. తాత్కాలికంగా వంతెనల కింద సిమెంటు పైపులు, ఇసుక బస్తాలు వేసి బీటీ రహదారి నిర్మించారు. శాశ్వత పనులకు రూ.190 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఒక్కపైసా విడుదల చేయలేదు.
ఉషోదయం ఎక్కడ?
హామీ: ‘ఇనగలూరులో రూ.800 కోట్లతో అపాచీ సంస్థ పరిశ్రమ 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇక్కడ 80 శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలో సరికొత్త ఉషోదయం మొదలవుతుంది.’
భూమిపూజ సందర్భంగా సీఎం చేసిన ప్రకటన
ప్రస్తుత స్థితి: భూమి పూజ చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పరిశ్రమ ఏర్పాటు కాకపోవడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయి.
ఇసుక మేటేసినా..
హామీ: ‘పంట నష్టపోయిన రైతులు ఎవరూ భయపడవద్దు. బాధితులకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తాం. వారం వ్యవధిలోనే ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా చూస్తాం.. స్వర్ణముఖి నదిపై బ్యారేజీ నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తాం’
వాకాడు మండలంలో పర్యటన సందర్భంగా ఇచ్చిన మాట.
ప్రస్తుత స్థితి: రైతులకు అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. బాధితులకు సరకులు కూడా తక్కువ తూకంతో ఇచ్చినట్లు ఎమ్మెల్యేనే స్వయంగా ఆరోపించారు. ఇసుక మేటలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వాటిని తొలగించేందుకు రూ.లక్షల్లో ఖర్చయితే రూ.వేలల్లో పరిహారం ఇచ్చి మమ అనిపించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టలేదు. స్వర్ణముఖి నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
పనులన్నీ తెదేపా హయాంలోనే..
హామీ: ‘వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్తూరుపాడు ప్రాజెక్టు పూర్తికి సవరించిన అంచనాల మేరకు రూ.553 కోట్ల నిధులు మంజూరు చేసి ఆమోదముద్ర వేస్తాం.’
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు.
ప్రస్తుత స్థితి: నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించినా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. తెదేపా హయాంలో జరిగిన పనులు మినహా ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. ఆల్తూరుపాడు చెరువు పనులు చేపట్టకపోవడంతో నీరు లేక మూడేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల, తిరుపతి దాహార్తి తీర్చేందుకు మరింత సమయం పట్టనుంది.
తిరుచానూరు ప్రాంతంలో వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు పరిశీలిస్తున్న సీఎం జగన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రచందనం దొంగకు ఓటేస్తే.. ఏమీ మిగలదు
[ 12-05-2024]
నాకు జన్మనిచ్చి రాజకీయ ఓనమాలు నేర్పిన చిత్తూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిని చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన మురకంబట్టు కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. -
జగన్ చిమ్మిన విషం.. పట్టణాలకు శాపం
[ 12-05-2024]
ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులను వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసే నగరపాలక, పురపాలక సంఘాలు.. ప్రజలకు కనీస సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయి.. -
ఆవిష్కరణలకు ఉరి.. యువతకేదీ దారి
[ 12-05-2024]
చదువు లేకున్నా అనేకమంది తమ ప్రతిభతో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తున్నారు. ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నా వారి ప్రతిభను గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పే వేదిక కావాలి. -
ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వాలంటీర్
[ 12-05-2024]
నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నగదు పంపిణీకి తెరలేపింది. నాయకులు బహిరంగంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ నాయకులతో కలిసి నగదు పంపిణీలో వాలంటీర్ పాల్గొన్న ఘటన మండలంలో శనివారం చోటుచేసు కుంది. -
ప్రచారంలో పాల్గొన్నాడని.. పింఛను ఆపేశారు
[ 12-05-2024]
మండల పరిధి నడింపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త క్రిష్ణప్పకు అందుతున్న సామాజిక పింఛను సాయాన్ని వైకాపా ఒత్తిళ్లతో అధికారులు నిలుపుదల చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం ఆరోపించారు. -
జగనన్న పాలనలో.. ఉద్యానానికి వట్టి చేతులే
[ 12-05-2024]
ఉద్యాన సేద్యానికి పేరుగాంచిన కుప్పం రైతులకు జగన్ ప్రభుత్వం నుంచి ఒరిగిన ప్రయోజనం శూన్యమే. నాలుగు మండలాల్లో వేల మంది రైతన్నలు లక్షల ఎకరాల్లో పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. -
‘నారాయణస్వామీ.. నిన్ను జైల్లో పెడతా’
[ 12-05-2024]
నారాయణస్వామీ నువ్వు ఎన్ని.. సారా దస్త్ల్రాల్లో సంతకాలు పెట్టావో మాకు తెలుసు అధికారంలోకి వచ్చాక నిన్ను జైల్లో కూర్చోబెడతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఛార్జీల మోతాదు పెంచిన జగన్
[ 12-05-2024]
‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అనేది.. శ్రీమంతుడులో మహేష్బాబు డైలాగ్. ప్రజలకు సంక్షేమం ఇచ్చాం.. అలాగే ప్రజలూ ప్రభుత్వానికి ఛార్జీల రూపంలో రెండింతలుగా ఇచ్చేయాలి అన్నది సీఎం జగన్ -
కూటమితో తిరుపతి ముఖచిత్రం మారుతుంది
[ 12-05-2024]
ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిని మోదీ ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా 50వేల మందికి ఇక్కడ ఉపాధి లభించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. -
కలగానే సాఫీ ప్రయాణం
[ 12-05-2024]
రహదారులే అభివృద్ధికి ప్రతీకలు. ఇది ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా తెలుస్తుంది. రాష్ట్రంలోని రహదారుల నిర్వహణకు పైసలు విదల్చని జగన్ సర్కార్ అంతర్రాష్ట్ర దారులను పట్టించుకోలేదు. -
వైకాపా కవ్వింపు చర్యలు
[ 12-05-2024]
భాకరాపేటలో శనివారం వైకాపా మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి పులివర్తి నాని ముగింపు ప్రచారంలో భాగంగా భాకరాపేటలోని గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. -
సమానత్వమేడ జగన్!
[ 12-05-2024]
‘నాణ్యత లేని నిర్మాణాలు.. కనీసం పునాదులు కూడా లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. గట్టిగా గాలి వీస్తే కూలిపోయే ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ మాత్రం సరిపోవట్లేదు. అందువల్ల పనులు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం’