ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు..
వేతన సవరణ అమలెక్కడ?
12వ పీఆర్సీ అమలు జాప్యం
మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు
న్యూస్టుడే, చిత్తూరు కలెక్టరేట్, కాణిపాకం, పూతలపట్టు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా రూ.లక్షల్లో నష్టం జరిగింది.. హక్కుగా దక్కాల్సిన ఫలాల్ని భిక్షమెత్తేట్లు చేసిన పాలకుల వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.. ఎంతో నమ్మకంతో తమ సమస్యలు పరిష్కరిస్తాడని నమ్మి ఓటేస్తే చివరకు సీఎం జగన్ ఇలా ముంచేశాడని బయటకు చెప్పుకోలేక ఉద్యోగ వర్గాలు అంతర్గతంగా మధనపడుతున్నాయి.. అసలు తమ సమస్యలు ఎన్నటికి పరిష్కారమవుతాయి.. తమకు అందాల్సిన వేతన ప్రయోజనాలు ఎప్పటికి అందుతాయోనని ఆయా వర్గాలు కన్నీటిపర్యంతమై తమ గోడు వెళ్లబోసుకోలేక వేకళ్ల ఎదురుచూస్తున్నాయి.
సకాలంలో డీఏలు ఇవ్వలేదు..
ఉద్యోగులకు సకాలంలో డీఏలు ఇవ్వకుండా 11వ పీఆర్సీలోనే ఐదు డీఏలు కలిపేశారు. దీంతో ఉద్యోగుల వేతనాలు పెద్దగా పెరగలేదు. పీఆర్సీ అరియర్స్, డీఏ అరియర్స్ను వేర్వేరుగా లెక్కించాలి. అప్పుడే ఉద్యోగికి న్యాయం జరుగుతుంది.
సోమశేఖర్నాయుడు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
పాత పీఆర్సీ బకాయిలు రాలేదు..
పాత పీఆర్సీ బకాయిల చెల్లింపులు పూర్తిగా జరగకముందే 12వ పీఆర్సీ వేశారు. దీంతో వేతనాల్లో మరింత వ్యత్యాసం రానుంది. కనీసం యూనియన్లతో చర్చించకుండా చేసిన ప్రభుత్వ అనాలోచిత చర్యతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సురేష్, అధ్యక్షుడు. యూటీఎఫ్, ఐరాల మండలం
రెండు డీఏలే ఇచ్చారు..
డీఏలు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. పీఎఫ్, ఈఎల్ ఎన్క్యాష్మెంట్ కాలేదు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదు రీబ్యాక్ రావడం లేదు. పీఆర్సీ అమలుకాక పోవడంతో ఒక్కో ఉద్యోగికీ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లింది.
నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, పూతలపట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. కూటమిదే అధికారం: చంద్రబాబు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. కూటమిదే అధికారమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుత్తూరులో నిర్వహించిన సభకు జనాలు అంతంతమాత్రంగానే వచ్చారు. వచ్చిన జనాలు సైతం జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఇష్టపడలేదు. -
చంద్రబాబు శ్రీకారం.. జగన్ నిర్వీర్యం
[ 11-05-2024]
ప్రజాప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసింది.. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది.. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత: కలెక్టర్
[ 11-05-2024]
సమస్యాత్మిక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామని; ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సూచించారు. -
బాబు సూపర్-6 పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
[ 11-05-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లింది. కూటమి అధికారంలోకి వస్తే అజెండాలో ప్రకటించిన పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. -
దోచుకున్న సొమ్మేగా.. కొనేద్దాం..!
[ 11-05-2024]
అధికారాన్ని కాపాడుకునేందుకు వైకాపా పడరాని పాట్లు పడుతోంది. తమ అభ్యర్థులు పేదలు, సామాన్యులు.. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూనే.. -
తెదేపాకు అనుకూలమా.. ఆపేయ్..!
[ 11-05-2024]
పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి విషయంలో అంతా సమానంగా ఉండాలి.. కానీ వైకాపాకు మాత్రం ఈ సిద్ధాంతం వర్తించదేమో అనిపించేలా పాలన సాగించారు.. -
ప్రలోభాలు ప్రారంభం.. ఇంటింటికీ కోడి మాంసం.. మద్యం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -
కదిలింది.. తెలుగు మహిళా లోకం
[ 11-05-2024]
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు చిత్తూరులో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. -
నోటుకు లేదు ఢోకా.. మందుచుక్కే కరవైంది
[ 11-05-2024]
‘ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగం కోసం సిఫార్సు లేఖ ఇచ్చింది నేనే కదా.. ఎన్నికల సమయంలో వీలైనంతగా సరకు పంపించే బాధ్యత నీకు లేదా.. -
వైకాపా సర్పంచికి మహిళల దేహశుద్ధి
[ 11-05-2024]
వైకాపా సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. కుప్పం మండలం యమనాసనపల్లిలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా సర్పంచి సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. -
నాయకుల బైండోవర్లు దారుణం
[ 11-05-2024]
గత ఆరు నెలల్లో జిల్లాలో తెదేపా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు వాపోయారు.