logo

ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్‌దే..!

రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్‌ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 03:05 IST

మహిళాభ్యుదయం తెదేపాతోనే సాధ్యం
హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ  

గూడూరులో నిమ్మకాయల గజమాలతో బాలకృష్ణకు అభిమానుల స్వాగతం

ఈనాడు - తిరుపతి, న్యూస్‌టుడే, గూడూరు పట్టణం: రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్‌ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఆయన హయాంలోనే వచ్చాయని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శనివారం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళాభ్యున్నతి కేవలం తెదేపాతోనే సాధ్యమన్నారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి రిషికొండను పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత ఇతర ప్రాంతాలపై కన్నేశారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల స్థానాలు మార్చేశారు. వందేళ్ల వరకు ఇసుక దొరక్కుండా దోచేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఇస్తాం. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో యువతకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ముందుగా తెదేపా శ్రేణులు గూడూరులో  ప్రదర్శన నిర్వహించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని