అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.
సీఎం జగన్ పలుకు పలుకులో పరనింద
అభివృద్ధిపై ప్రస్తావించకుండా జిల్లా పర్యటన ముగింపు
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రామ్కుమార్రెడ్డి, గురుమూర్తి
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, వెంకటగిరి, బాలాయపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. చేయని పనులు సైతం గొప్పగా చెప్పుకొనే వ్యక్తి జగన్మోహన్రెడ్డి మాత్రమేనంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
చేనేతలను పట్టించుకోరా?
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక భారీగా విద్యుత్తు ఛార్జీలు పెంచిన అంశాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కడప జిల్లా కుక్కలదొడ్డి ప్రాంతం నుంచి నీటిని తరలించడం కష్టమవుతుందని గుర్తించిన చంద్రబాబునాయుడు తన హయాంలో తెలుగుగంగ ద్వారా బాలాజీ, మల్లెమడుగు జలాశయాలకు నీటిని తరలించాలని ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆల్తూరుపాడు జలాశయ పనులు ప్రారంభించగా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిల్చిపోయాయి. గతేడాది జులైలో వెంకటగిరి పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.553 కోట్లు మంజూరు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. పనులు ప్రారంభం కాలేదు. దీనిపై ప్రసంగంలో ప్రస్తావించలేదు. వెంకటగిరిని ఆనుకుని ఇనగలూరు వద్ద అపాచీ పరిశ్రమపై ఒక్క మాట మాట్లాడలేదు. గతంలో జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఒక్క పెద్ద పరిశ్రమ తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించింది లేదు. ఇప్పుడు కనీసం పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలు ఎక్కడా ఆయన ప్రసంగంలో చెప్పలేదు.
సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరుగుతున్న కార్యకర్తలు
ఏదీ ప్రణాళిక?
జిల్లా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమలు తెస్తే ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ జీడీపీ పెరుగుతుంది. దీనిపై ప్రణాళికలు లేవన్నట్లుగానే ఆయన ప్రసంగం ద్వారా తేలిపోయింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఇసుక, మద్యం, గ్రావెల్ ద్వారా దండుకోవడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
మద్యం, బిర్యానీ పంపిణీ..
సభకు జనాలను తరలించేందుకు స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మధ్యాహ్న సమయంలో వస్తారో లేదోనని ప్రజలను ఉదయమే ఆటోలు, ట్రాక్టర్లు, బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలించారు. మహిళలకు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేయగా.. పురుషులకు బిర్యానీ, మందు పంపిణీ చేశారు. సీఎం మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు రాకపోవడంతో ఎండ వేడికి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. కొందరు ఎండ వేడికి తాళలేక మంచినీళ్ల ప్యాకెట్లతో ముఖం కడుక్కోవడంతోపాటు ఒంటిమీద, కాళ్ల మీద పోసుకుని సేదతీరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో పరిస్థితి అదుపులోనే ఉంది.. నిందితులను అరెస్టు చేస్తాం: ఎస్పీ
[ 14-05-2024]
తిరుపతిలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. -
పులివర్తి నానిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
[ 14-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడి ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
[ 14-05-2024]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. -
తిరుచానూరులో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 14-05-2024]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వసంతోత్సవాలు జరగనున్నాయి. -
తెదేపా మద్దతుదారుల వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన దుండగులు
[ 14-05-2024]
రామకుప్పం మండలంలో ఇద్దరు తెదేపా ఏజెంట్ల వ్యవసాయ పరికరాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. -
ప్రజాస్వామ్యాన్ని తోసిరాజని.. అరాచకస్వామ్యాన్ని వీడలేమని
[ 14-05-2024]
అరాచక పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపా.. మళ్లీ పీఠమెక్కేందుకు అడ్డదారులనే ఎంచుకుంది. పచ్చనోటు.. దొంగ ఓటు.. మద్యం ప్రవాహం.. ఇతరత్రా తాయిలాలతో అధికార పార్టీ ప్రలోభాల వల విసిరినా.. -
ఓటేసిన ప్రముఖులు
[ 14-05-2024]
రాజంపేట పార్లమెంటు, పుంగనూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలసి వారి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఓటేశారు. -
దొంగ ఓటేసేందుకు వచ్చిన ఐదుగురిపై కేసులు
[ 14-05-2024]
అధికార వైకాపా దొంగఓటుకు యత్నించింది. తమిళనాడు, రేణిగుంట, కోడూరు తదితర ప్రాంతాల నుంచి రప్పించి దొంగ ఓట్లకు యత్నించారు. పలు బూత్ల పరిధిలో మరొకరి ఓటరు స్లిప్పులతో ఓటింగ్కు యత్నిస్తూ పలువురు దొరికిపోయారు. -
ఏఎస్డీ జాబితా పట్టించుకున్నదెవరు!
[ 14-05-2024]
‘దొంగ, బోగస్ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేదు.. పోలింగ్ కేంద్రంలోని ప్రతి ప్రిసైడింగ్ అధికారుల వద్ద ఏఎస్డీ(ఆబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్) జాబితా ఉంటుంది. దానిద్వారా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని సులువుగా పట్టేయవచ్చు.. -
ఉదయాన్నే మొరాయించి.. సతాయించి
[ 14-05-2024]
ఓటువేసి ప్రజాస్వామ్యానికి బంగారు బాటలు వేద్దామనుకున్నవారంతా మొరాయించిన ఈవీఎంలను చూసి ఉసూరుమన్నారు. పోలింగ్ సమయానికి అరగంట ముందే కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లకు వాటితో నిరాశే మిగిలింది. -
రామిరెడ్డిపల్లిలో చిందిన రక్తం
[ 14-05-2024]
రామిరెడ్డిపల్లి పంచాయతీలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ పెద్దదైంది. పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో సోమవారం రాత్రి వైకాపా వర్గీయులు గ్రామంలోకి వచ్చి రాళ్లు విసరడంతో ఎనిమిదిమంది గ్రామస్థుల తలలు పగిలాయి. -
రెండు గ్రామాల్లో ఇరువర్గాల ఘర్షణలు
[ 14-05-2024]
పోలింగ్ సందర్భంగా సోమవారం మండలంలోని రెండు గ్రామాల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. -
ఇలా బాదేశావేం.. జగన్
[ 14-05-2024]
సీఎం జగన్ గత ఐదేళ్లలో నిత్యావసర ధరల్ని ఇష్టానుసారంగా పెంచేసి.. పేదల అవసరాల్ని, తప్పించుకోలేని ఖర్చుల రూపంలో దండుకున్నారు. బటన్ నొక్కి డైరెక్ట్గా సంక్షేమం డీబీటీ చేశామని మాటలు చెప్పి.. -
పెరుమాళ్లకండ్రిగపై.. పచ్చనపల్లె వైకాపా శ్రేణుల దాడి
[ 14-05-2024]
ఎన్నికల నేపథ్యంలో గ్రామాలపై మధ్య అధికార వైకాపా చిచ్చుపెట్టింది. చిత్తూరు మండలం పెరుమాళ్ల కండ్రిగలో సోమవారం తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానైంది. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడి
[ 14-05-2024]
దొంగఓట్లు వేస్తున్న వైకాపా నాయకులను చిత్రీకరించారన్న నెపంతో వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం 14 కండ్రిగ ముస్లిం వాడలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
పలు చోట్ల ఈవీఎంల మొరాయింపులు
[ 14-05-2024]
ఈవీఎం ఇబ్బంది పెట్టడంతో ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. పలమనేరులో 8 చోట్ల, పుంగనూరులో 13 చోట్ల, కుప్పంలో 14 చోట్ల నిలిచిపోగా.. సాంకేతిక నిపుణుల సాయంతో వాటిని పునరుద్దరించి గంటలోపే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. -
ఏనుగు దాడిలో ఒకరి మృతి
[ 14-05-2024]
అడవి ఏనుగు వీరంగం సృష్టించింది. ఆదివారం అరగొండ సమీపంలో ఒకరిని పొట్టనబెట్టుకున్న మదగజం అక్కడి నుంచి పూతలపట్టు మండలం మీదుగా సోమవారం పాకాల మండలంలో ప్రవేశించింది. -
క్రికెట్ ఆట తెచ్చిన తంటా
[ 14-05-2024]
క్రికెట్ ఆట తెచ్చిన తంటా రెండు గ్రామాల యువకుల మధ్య గొడవకు కారణమైంది. స్థానికుల కథనం మేరకు.. పుల్లూరు, పుల్లూరు ఎస్సీ కాలనీ యువకులు రెండు వారాల క్రితం ఆడిన క్రికెట్ సందర్భంగా మనస్పర్థలు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...