జన, ధన, మాన చోరుడు జగన్..
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు.
చంద్రబాబు వస్తేనే స్వర్ణ యుగం
చిత్తూరులో నందమూరి బాలకృష్ణ
బంగారుపాళ్యంలో బాలకృష్ణకు గజమాల
చిత్తూరు(సంతపేట), బంగారుపాళ్యం, న్యూస్టుడే: ‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి.. జగన్ మళ్లీ గెలిస్తే చీకటియుగం వస్తుంది.. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని వదలి వెళ్లే పరిస్థితి వస్తుంది. జన, ధన, మాన చోరకుడు జగన్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే పాశుపతాస్త్రం తెదేపా, జనసేన, భాజపా కూటమి.. ఈ ఎన్నికల్లో ఓటర్లు బాణాలై వైకాపా పాలనకు చరమగీతం పాడాలి’ అని హిందూపరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బాలకృష్ణ సోమవారం రాత్రి చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్రకు చిత్తూరు, బంగారుపాళ్యంలో అపూర్వ స్పందన దక్కింది. చిత్తూరు బైపాస్ రోడ్డు నుంచి సంతపేట మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు పసుపు దళం బాలకృష్ణకు జేజేలు పలికాయి. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు.
ఎర్రచందనం స్మగ్లర్కు చిత్తూరు వైకాపా టికెట్.. ‘వైకాపా దోపిడీదారుల్నే ప్రోత్సహిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఇందుకు నిదర్శనం. చిత్తూరులోని సహకార డెయిరీని కమీషన్లకు కక్కుర్తి పడి అమూల్కు ఇచ్చేసింది. చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిచ్చే ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న యువకుడు గురజాల జగన్మోహన్, ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలి. జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. తెదేపా హయాంలో మామిడి రైతుకు టన్నుకు రూ.5వేల నగదు అందచేసింది. మంత్రి పెద్దిరెడ్డి గ్రానైట్, అక్రమ ఇసుక వ్యాపారాలు సాగించి రూ.కోట్లు దోచుకున్నార’ని బాలకృష్ణ ఆరోపించారు.
చిత్తూరు నగరంలో మహిళల విజయకేతనం
విధ్వంసమే వైకాపా లక్ష్యం.. ‘రాయలసీమలో తెలుగు గంగ, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, కియా పరిశ్రమల, శ్రీసిటీలో ప్రఖ్యాత కంపెనీల్ని తెదేపా తీసుకొస్తే వైకాపా భూకబ్జా, కల్తీ లిక్కర్ వ్యాపారం, గంజాయి, డ్రగ్స్ వ్యాపారంతో సీమను విధ్వంసం చేసింది. ఐదేళ్లలో ప్రజలకు కష్టాల్ని చూపిన జగన్ను తరిమికొట్టేందుకు ఓటర్లంతా సంసిద్ధం కావాలని’ బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్ హేమలత, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్, మండల అధ్యక్షులు జయప్రకాష్నాయుడు బాలక్రిష్ణకు క్రేన్ సాయంతో భారీ గజమాలతో స్వాగతం పలికారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు జయచంద్రనాయుడు ఎన్నికలపై రచించిన సంసిద్ధం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!