భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు పోలీసులమంటూ హింసించిన వైనం
నిందితుల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఛైర్మన్
ఈనాడు, చిత్తూరు- గంగాధరనెల్లూరు, న్యూస్టుడే
ఏ1 మురుగన్ , ఏ2 దీపక్కుమార్ తాళ్ల
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఛైర్మన్ ఉండటం గమనార్హం. గంగాధరనెల్లూరు సీఐ మారుతీ శంకర్ కథనం మేరకు.. అగరమంగళం ఎస్సీ కాలనీకి చెందిన రామచంద్రన్ చెరువు కిందున్న తన ఎకరా పొలంలో అంకాళ పరమేశ్వరి చిత్రపటంతో పూజలు చేస్తూ జాతకాలు చెప్పేవారు. పెనుమూరు మండలానికి చెందిన దీపక్ కుమార్ తాళ్ల బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి స్థిరపడ్డారు. 15 ఏళ్ల కిందట అగరమంగళానికి వచ్చిన ఆయన అమ్మవారి దయతో చిన్నతనంలో తనకు వచ్చిన వ్యాధి నయమైందని, ఆలయాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తానన్నారు. కోట్లాది రూపాయలతో అంకాళ పరమేశ్వరి ఆలయాన్ని ఐదేళ్ల కిందట పూర్తి చేశారు. ఆలయ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వచ్చిన ఆయన కొందరి భూములు బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు న్నాయి. ఈ క్రమంలో పూజారి రామచంద్రన్, దీపక్ కుమార్కు ఆలయ ధర్మకర్త విషయమై వివాదం మొదలైంది.
లాడ్జీలో బంధించి.. గుడి సమీపంలో రామచంద్రన్ భూమిని ఆలయం పేరిట రాసివ్వాలని దీపక్కుమార్ ఒత్తిడి చేశాడు. ఇందుకు రామచంద్రన్ అంగీకరించక ఆలయ వ్యవహారాల నుంచి బయటకు వచ్చేశారు. నెల కిందట దీపక్కుమార్ అనుచరుడైన మురుగన్ పది మందితో పోలీసు దుస్తుల్లో వచ్చి తమిళనాడు పోలీసులమంటూ అగరమంగళం చెరువు వద్ద రామచంద్రన్ను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. మొదట శ్రీరంగరాజపురంలోని స్మార్ట్ డీవీ కంపెనీ వద్దకు, తర్వాత కాట్పాడి, ఆర్కాట్, దిండిగల్ ప్రాంతాల్లో తిప్పారు. చివరకు తమిళనాడు పరిధిలోని ఓ లాడ్జిలో వారం రోజులు హింసించారు. భూమి రాసివ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. రామచంద్రన్ కుటుంబీకులు న్యాయం చేయాలంటూ జీడీనెల్లూరు పోలీసుల వద్దకు వెళ్లారు. సీఐ శంకర్ సమగ్ర దర్యాప్తు చేసి తమిళనాడులో ఉన్న బాధితుడిని విడిపించి తీసుకొచ్చారు.
వైకాపా అభ్యర్థితో సంబంధాలు.. దీపక్కుమార్కు జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థితో సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీరంగరాజపురం మండలం కొటార్లపల్లెలో అతని స్థలాన్ని కొని దీపక్కుమార్ స్మార్ట్డీవీ కంపెనీ పెట్టడం గమనార్హం.
12 మందిపై కేసు.. రామచంద్రన్ ఫిర్యాదు మేరకు ఏ1గా మురుగన్, ఏ2గా దీపక్కుమార్ తాళ్ల, మరో పది మందితో కలిపి మొత్తం 12 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పది మందిలో తమిళనాడుకు చెందిన ఏడుగురు, అగరమంగళానికి చెందిన శరత్, విజయకుమార్, పవన్ ఉన్నారు. ఇందులో శరత్ను రిమాండ్కు పంపారు. బాధితుడు రామచంద్రన్ శనివారం మీడియాకు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్నందున అప్పట్లో వివరాలు తెలపలేకపోయామని పోలీసులు దాట వేస్తున్నారు.
మత్తుమందిచ్చి గాయపరిచి
గతనెల 18న తమిళనాడు పోలీసులమని చెప్పి పది మంది నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. విషపు ఇంజక్షన్ వేసి తమిళనాడులోని వేలూరు సమీపంలోని లాడ్జిలో బంధించి భూమి రాసివ్వాలని హింసించారు. లేదంటే చంపేస్తామని, నరికేస్తామని హెచ్చరిస్తూ సూదులతో గుచ్చి గాయాలపాలు చేశారు. చివరకు పోలీసుల రాకతో బయటపడి ఆసుపత్రిలో చేరా. ఇంజక్షన్ ఇవ్వడంతో తల తిరుగుతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చాయి.
రామచంద్రన్, బాధితుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. ఆడితే ఖతం
[ 02-06-2024]
శాసనసభ పోరులో గెలుపోటములపై పందేల వేట సాగిస్తున్నారు. ఈ ఊబిలోకి సామాన్యులను సైతం వైకాపా ముఠాలు దించుతున్నాయి. వారిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. -
వసతి గృహాల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ముఖ్యమంత్రి జగన్ ఏ సభ, సమావేశం జరిగినా మైక్ పట్టుకుని ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అంటూ పల్లవి పాడుతుంటారు. -
లెక్కలు తేలే రోజుకు కౌంట్డౌన్
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. -
మొదటిరోజు ఆలస్యంగా జమ
[ 02-06-2024]
సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల కష్టాలు జూన్లోనూ కొనసాగాయి. ఎన్నికల్లో లబ్ధే లక్ష్యంగా ప్రభుత్వం రెండు నెలలుగా పింఛనర్లను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
తెదేపా సానుభూతిపరులపై అదే ప‘నిఘా’
[ 02-06-2024]
దాడులకు తెగబడే వారిని నియంత్రించాల్సిన పోలీసులు.. బాధితులపైనే నిఘా పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్పై పేచీ తొలగినట్లేనా?
[ 02-06-2024]
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇక అందరి కళ్లు పోస్టల్ బ్యాలెట్లపై పడనున్నాయి. -
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలి
[ 02-06-2024]
చిత్తూరు లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపులో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. -
విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి
[ 02-06-2024]
బంగారు భవిష్యత్తు కలిగిన ఓ విద్యార్థి విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి తన రెండు కాళ్లు కోల్పోయాడు. -
గాలివాన బీభత్సం
[ 02-06-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పెనుగాలుల వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమి వల్ల ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
పోలీసులు సంసిద్ధంగా ఉండండి: ఎస్పీ
[ 02-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పోలీసు అధికారులు సంసిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!