మహిళా శక్తిని చాటేలా సాధికారత ఉత్సవం
మహిళా శక్తిని చాటిచెప్పేలా ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పద్మ
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): మహిళా శక్తిని చాటిచెప్పేలా ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాజమహేంద్రవరం వేదికగా శనివారం జరిగే ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటారన్నారు. ఆనం కళాకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉత్సవంలో రాష్ట్ర మంత్రులు ఆర్.కె.రోజా, తానేటి వనిత, ఉషశ్రీచరణ్, రజని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుతోపాటు పలువురు ఎంపీలు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. కార్యక్రమ వివరాలు ఇలా వెల్లడించారు. * మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు మహిళలతో బైక్ ర్యాలీ, గుర్రపు స్వారీ. ‘దిశ’ చట్టంపై ప్రచారం చేస్తూ ఈ ర్యాలీ సాగుతుంది. * సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య మైదానంలో మహిళలకు కరాటే, కర్ర సాము, కబడ్డీ, కోలాటం తదితర పోటీలు. * సాయంత్రం 5 గంటలకు ‘సబల’ లఘు చిత్రాల ప్రదర్శన. పోటీల్లో ఎంపికైన వాటికి రూ.5 లక్షల బహుమతులు అందజేస్తారు. ఉత్తమ నటీనటులుగా ఎంపికైన వారికి కూడా రూ.20 వేల చొప్పున బహుమతులు అందిస్తారు. * సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమం. అనంతరం వివిధ కళారూపాలు, నృత్యప్రదర్శనలు. * రాత్రి 8 గంటలకు వివిధ పోటీల్లో
విజేతలైన మహిళలకు బహుమతుల ప్రదానం, స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం