CT Scan: సిటి స్కాన్ వివరాలా..ఫొటో తీసుకోవాల్సిందే..
ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ జీజీహెచ్లో సిటి స్కాన్ రిపోర్టు కోసం రోగులకు తిప్పలు తప్పడం లేదు.
కంప్యూటర్ స్క్రీన్పై ఉన్న నివేదికను చరవాణిలో నిక్షిప్తం చేసుకుంటున్న చిత్రం
న్యూస్టుడే, మసీదుసెంటర్(కాకినాడ): ఉభయగోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ జీజీహెచ్లో సిటి స్కాన్ రిపోర్టు కోసం రోగులకు తిప్పలు తప్పడం లేదు. కొంత కాలం నుంచి పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) పద్ధతిలో రోగులకు సిటి స్కాన్ యంత్రం ద్వారా సేవలందిస్తున్నారు. దీనికి సంబంధించి ఫిల్మ్ అందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రోగులకు ఉచితంగా సిటి స్కాన్ తీస్తారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని రోగుల బంధువులు ఫొటో తీసుకోవచ్చు.. ఒకవేళ స్కానింగ్కు సంబంధించి ఫిల్మ్ అవసరమైతే రూ.300 చెలిస్తే నిర్వాహకులు ఇచ్చేవారు. ఇలా డబ్బులు తీసుకోవడంపై ఓ రోగి ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిల్మ్ ఇవ్వవద్దని జీజీహెచ్ సూపరింటెండెంట్ నిర్వాహకులకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వారం రోజుల నుంచి ఫిల్మ్ అందక రోగులు వైద్యానికి ఇబ్బంది పడుతున్నారు. ఫిల్మ్ ఉంటే మెరుగైన వైద్యం చేసేందుకు వీలుంటుందని వైద్యులు చెబుతున్నారని, ఇక్కడ ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు శస్త్రచికిత్సలు చేయాలంటే సిటిస్కాన్ ఫిల్మ్ విధిగా ఉండాలని, లేకుంటే అనుమతులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.హేమలతాదేవి వద్ద ప్రస్తావించగా ఎస్ఎల్ డయాగ్నోస్టిక్తో జరిగిన ఎంవోయూలో ఉచితంగా సిటి స్కాన్ తీయడం మాత్రమే ఉందన్నారు. ఉచితంగా ఫిల్మ్ అందించాలనే విషయం లేదన్నారు. రూ.300 చెల్లించి ఫిల్మ్ తీసుకునే విధానాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల నిలిపివేసినట్లు చెప్పారు. సిటి స్కాన్కు సంబంధించి చిత్రాలు, నివేదికల సాఫ్ట్, హార్డ్ కాపీలు రోగికి ఉచితంగా అందజేస్తారని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదు: పవన్
[ 11-05-2024]
దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎం ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. -
పిఠాపురంలో రామ్చరణ్.. జనసైనికుల్లో నూతనోత్సాహం
[ 11-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా ప్రముఖ నటుడు రామ్చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో పర్యటించారు. -
పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారు: నాగబాబు
[ 11-05-2024]
వైకాపా నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. -
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్