Andhrapradesh news: తిరిగొస్తావనుకుంటే.. కడుపుకోత మిగిల్చావా..!
అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు.
హోసన్న (పాత చిత్రం)
చాగల్లు, న్యూస్టుడే: అదృశ్యమైన బిడ్డ కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఏ క్షణమైనా తిరిగొస్తాడని ఆశగా చూస్తున్నారు. తీరా చెరువులో విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొవ్వూరు మండలం పంగిడికి చెందిన వి.జాన్రత్నం, మరియమ్మ దంపతులు స్థానికంగా నల్లపూసలు వంటివి విక్రయిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మూడో సంతానమైన హోసన్న(9) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం చాగల్లులోని మాతంగి చెరువులో ఓ బాలుడి మృతదేహం దొరికిందన్న సమాచారంతో వెళ్లి చూశారు. దుస్తులు ఆధారంగా హోసన్నగా నిర్ధారించారు.
గతేడాది తమ్ముడు.. ఇప్పుడు అన్న..
ఏడాది క్రితం నాలుగో సంతానమైన జయరాజు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి వద్ద నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. ఇప్పుడు హోసన్న మృతితో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్న కొడుకు నీటి తొట్టెలో, పెద్దకొడుకు చెరువులో పడి మృత్యువాత పడటంతో విధి తమపై పగబట్టిందా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిడదవోలు తరలించారు. జాన్రత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై హుస్సేన్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ బలవన్మరణం
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొమ్మూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్మోహన్రావు తెలిపిన వివరాల మేరకు.. దివాన్చెరువు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి రామకృష్ణ(63) నగరంలో ఆటో నడుపుతూ.. అతడి భార్య సీత స్థానికంగా కూరగాయల అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 8న రామకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటర్లు, పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్నీ వసతులు, సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని ఎంసీసీ అధికారి రమణ తెలిపారు. -
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళల మృతి
[ 12-05-2024]
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతిచెందారు. -
మీ ఓటు అభివృద్ధికా.. అరాచకానికా?
[ 12-05-2024]
సహజ సంపదకు నిలువెత్తు ఠీవిలా కనిపించే గిరులకు బోడిగుండు కొట్టేశారు.. యువతకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా ఉస్సూరనిపించారు.. -
మీ కోపం ఓట్ల రూపంలో చూపండి
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రం కాకినాడలోని బాలాజీ చెరువు కూడలిలో ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. -
పట్టించుకోని ప్రభుత్వం.. పడకేసిన పథకం
[ 12-05-2024]
కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. అలా ఉత్పత్తి చేసేందుకు నీరు ఉపయోగించేవారు. -
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
[ 12-05-2024]
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించారు. -
ఓటేసేందుకు సొంతూళ్లకు..
[ 12-05-2024]
విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలివస్తున్నారు. -
బాధ్యత మరిచి.. భారం మోపి
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాలు మోపింది. సంక్షేమ పాలన పేరుతో గొప్పులు చెబుతూనే పథకాలను ఆశచూపి కొందరికే వాటిని అర్హులను చేసింది. ఇచ్చేది గోరంత.. -
జగనన్నా.. ఇదేనా ఆహ్లాదం
[ 12-05-2024]
వి.ఎల్.పురంలోని తెలుకులవారి చెరువు పార్కు లోపల కొన్ని విద్యుత్తు ల్యాంపులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని దీపాలు సరిగా వెలగడం లేదు. -
అయిదేళ్ల అధికారం.. అంతటా అంధకారం
[ 12-05-2024]
పండించిన పంటకు పెట్టుబడి కూడా దక్కక రైతన్న కన్నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత.. -
ష్.. గప్చుప్
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. -
కట్టలు పంచి.. మత్తున ముంచి
[ 12-05-2024]
మైకుల హడావిడి లేదు.. ప్రచార హోరు లేదు.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ఎక్కడివక్కడ గప్చుప్. తెరవెనుక రాజకీయం మొదలైంది..
తాజా వార్తలు (Latest News)
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
-
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్.. థాంక్స్ చెప్పిన ప్రధాని
-
దిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపుల కలకలం..
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
సొంతగడ్డపై మురిసిన చెన్నై.. రాజస్థాన్పై ఘన విజయం
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు