ప్రలోభాలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని
యంత్రాంగానికి సూచనలిస్తున్న ఎన్నికల పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం, కమల్కాంత్ సరోఛ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో పలు సూచనలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా జరిగేలా చూడాలన్నారు. కమల్కాంత్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వ్యయ పరిశీలకులు రోహిత్నగర్, జైఅరవింద్, నితిన్కురియన్, పోలీసు పరిశీలకుడు బలరామ్మీనా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, నియోజవర్గాల రిటర్నింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్లు ఇబ్బందులు పడకుండా అన్నీ వసతులు సిద్ధం
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్ల ఇబ్బందులు పడకుండా అన్నీ వసతులు సిద్ధం చేయాలని ఐఏఎస్ అధికారి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కమల్ కాంత్ సరోచ్ తెలిపారు, -
32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదు: పవన్
[ 11-05-2024]
దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎం ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. -
పిఠాపురంలో రామ్చరణ్.. జనసైనికుల్లో నూతనోత్సాహం
[ 11-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా ప్రముఖ నటుడు రామ్చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో పర్యటించారు. -
పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారు: నాగబాబు
[ 11-05-2024]
వైకాపా నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. -
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.