నిలదీద్దాం.. వైకాపాను గద్దె దించేద్దాం
కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు.
వారిని మళ్లీ గెలిపిస్తే ప్రజలను తొక్కేస్తారు
ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి
ఇంద్రపాలెం, సామర్లకోట బహిరంగ సభల్లో జనసేనాని పవన్కల్యాణ్
ప్రసంగిస్తున్న పవన్.. చిత్రంలో ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీ, పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, సర్పవరం జంక్షన్, గాంధీనగర్, మసీదు సెంటర్, సామర్లకోట, గ్రామీణం, యు.కొత్తపల్లి, పెద్దాపురం: కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ‘చలమలశెట్టి సునీల్ ప్రతి అయిదేళ్లకో పార్టీ మారిపోతాడు.. ఐడియాలజీ లేదు. ఒక పార్టీకి నిలబడని వాడు.. మీకోసం ఎలా నిలబడతాడ’ని పవన్కల్యాణ్ ప్రశ్నించారు. దళిత డ్రైవర్ను చంపేసి డోర్డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఎంపీ అభ్యర్థి సునీల్ పక్కన తిప్పుకొంటున్నాడు.. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు.. ప్రజల్ని ఎలా చూస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. హత్యలు, దోపిడీలు చేసి బయటకు వచ్చి ఏమైనా చేసేస్తామంటే ప్రజలు స్వాగతించరన్నారు. వైకాపా ఎమ్మెల్యే, ఎంపీలు వస్తే ఎందుకు మీకు ఓట్లేయాలని అడగండని ప్రజలను కోరారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, పెద్దాపురం తెదేపా అభ్యర్థి చినరాజప్పను గెలిపించాలని కోరారు. ఎక్కడ తెదేపా, భాజపా పోటీచేస్తున్నా జనసేన నాయకులు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
- ‘ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి అహంకారం.. తెదేపా అధినేతను, నన్ను పొగరు ఎక్కువై ఎలాపడితే అలా తిట్టాడు.. కన్నబాబు, మీరు చేసింది మర్చిపోలేదు. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది’
- కాపుల పక్షాన ఉన్నానని మాట్లాడే కన్నబాబు.. కాపు రిజర్వేషన్ ఇవ్వనని జగన్ చెప్పినప్పుడు పక్కనే ఉన్నా ఎందుకు మాట్లాడలేదు.
- ఇసుక మన అందరి సొత్తా? లేదా జగన్, కన్నబాబు, ద్వారంపూడి, చలమలశెట్టి సొత్తా.. మానవ వనరులు, సహజ వనరులన్నీ మన ఆస్తి అని గుర్తుంచుకోండి.. ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపిస్తే ప్రజలను తొక్కేస్తారని అర్థం చేసుకోండి
పవన్ కల్యాణ్
ఎవర్నో నలిపేసి ఎదగకూడదు..
చిరంజీవి పడేసిన భిక్షతో కన్నబాబు రాజకీయంలోకి వచ్చారని పవన్ విమర్శించారు. కన్నబాబూ.. ఇలా రా అంటే పరుగెత్తుకు వచ్చే వ్యక్తి. చిరంజీవి దగ్గరకు వచ్చి చిన్న సమాచారం ఇచ్చేవ్యక్తి.. అంచెలంచెలుగా ఎదిగారు. నాయకులుగా ఎదగాలి మాకేం ఇబ్బందిలేదు. ఎవర్ని నలిపేసి ఎదుగుతున్నావనేది కీలకం..అని వ్యాఖ్యానించారు.
సామర్లకోట సభలో పవన్.. చినరాజప్ప, ఉదయ్ శ్రీనివాస్
పరిష్కారం చూపుతా..
సూర్యారావుపేటలో మత్స్యకారుల గుడిసెలు కన్నబాబు బలవంతంగా ఖాళీచేయించారు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రమే ఇచ్చారు. మిగిలినవి వీళ్లే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చాక స్థలాలు కేటాయించేలా చూస్తామని పవన్కల్యాణ్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెవెన్యూ అధికారిని వేధించారని.. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కొంగోడు గ్రామానికి వంతెన చాలా అవసరం.. కమిషన్ కోసం కాంట్రాక్టర్ను కన్నబాబు తరిమేశారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకాలు, జూనియర్ కళాశాల, అవుట్డోర్ స్టేడియంతోపాటు. కరపలో ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు.. డీజిల్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. నైపుణ్య శిక్షణ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అభివాదం చేస్తూ...
మత్స్యకారులను గుండెల్లో పెట్టుకుంటాం..
దేశంలో 30 శాతం మత్స్యసంపద ఉత్పత్తి, 35 శాతం ఎగుమతి రాష్ట్రం నుంచే జరగుతున్నా.. తుపానులు తట్టుకునే ఇళ్లు లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి.మిమ్మల్ని గుండెల్లోకి హత్తుకుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పవన్కల్యాణ్ భరోసా ఇచ్చారు.
ఇంద్రపాలెంలో అశేష జనవాహిని
జిల్లా నాయకులకే నిర్ణయాధికారం ఉండాలి..
జిల్లాలోని కొండలు తవ్వాలన్నా.. మైనింగ్ చేయాలన్నా మిథున్రెడ్డి అనుమతి తీసుకోవాలి. ఈ పరిస్థితి మారాలని, స్థానిక నాయకులకే వనరులపై స్వీయ నిర్ణయాధికారం, సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి తప్ప జగన్కు, మిథున్కు కాదని పవన్ అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏడీబీ, కెనాల్ రహదారులు నిర్మిస్తామని.. చెరుకు, కర్రపెండలం, పామాయిల్ రైతులకు మేలు చేస్తామని భరోసానిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్లు ఇబ్బందులు పడకుండా అన్నీ వసతులు సిద్ధం
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్ల ఇబ్బందులు పడకుండా అన్నీ వసతులు సిద్ధం చేయాలని ఐఏఎస్ అధికారి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కమల్ కాంత్ సరోచ్ తెలిపారు, -
32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదు: పవన్
[ 11-05-2024]
దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎం ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. -
పిఠాపురంలో రామ్చరణ్.. జనసైనికుల్లో నూతనోత్సాహం
[ 11-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా ప్రముఖ నటుడు రామ్చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో పర్యటించారు. -
పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారు: నాగబాబు
[ 11-05-2024]
వైకాపా నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. -
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.