పిఠాపురం.. కొరకరాని కొయ్య
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
ప్రలోభాలతో వైకాపా అడ్డగోలు ప్రయత్నాలు
కాకినాడ కలెక్టరేట్: పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. రూ. వందల కోట్లు ఖర్చు చేసైనా పిఠాపురం పీఠమెక్కాలని లోతైన కుట్ర చేస్తోంది. జనసేనాని పవన్కల్యాణ్కు పూర్తిగా మద్దతు తెలుపుతున్న వర్గాలపై గురిపెట్టి నగదు పంపిణీకి తెరతీసింది. ప్రధానంగా యు.కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామాలపై దృష్టిపెట్టి వేట నిషేధ సమయమైనందున రేషన్ కార్డుకు రూ.1,500 లెక్కన పంపిణీ చేస్తోంది. పోలింగ్కు ముందు మరింత ఇస్తామని ఓటర్లకు ఆశ చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనానికి అనేక వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులు ఆయన వెంట నడిచేందుకు సిద్ధ్ధమవుతున్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు జారిపోకుండా సొమ్ముతో వైకాపా కట్టడి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలానే రెండు,మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, మద్యం నిల్వ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నిఘా బృందాలు జల్లెడ పడితే డంప్లు వెలుగుచూసే అవకాశం ఉందిన పలువురు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
[ 13-05-2024]
హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న లక్ష్మణరావు ఓటు వేయటానికి భార్య కనకలక్ష్మితో కలసి స్వగ్రామం బిక్కవోలు మండలం కొంకుదురు రావాలనుకున్నారు. అందుకు శనివారం ఉదయం 5 గంటలకే బస్టాండ్కు వెళ్లారు. -
అమ్మలా చక్కదిద్దాలి
[ 13-05-2024]
అవకాశాల్లో సగం ఉన్న మహిళలు.. ఓటు హక్కులో పురుషులకంటే పైచేయి సాధించారు. ఉమ్మడి జిల్లాలో మూడు లోక్సభ, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. -
సార్వత్రిక సమరం.. సంధించు పాశుపతాస్త్రం
[ 13-05-2024]
ఓట్ల పండగ వచ్చేసింది.. రాజ్యాంగం ఇచ్చే పాశుపతాస్త్రాన్ని మనం సంధించే రోజు ఇది. తీర్పు లిఖించడానికి సిద్ధమవ్వాలి. అయిదేళ్ల వేదనలకు, విధ్వంసాలకు చరమగీతం పాడి నికార్సయిన నాయకత్వాన్ని ఎన్నుకుంటేనే రేపటి తరానికి ఉజ్వల భవిత. -
తాయిలాలు.. నిలదీతలు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్కు ముందురోజు వరకు అన్ని అవకాశాలనూ వినియోగించుకునేందుకు అధికార పార్టీ నాయకులు అడ్దదారులు తొక్కారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. -
రద్దీకి అనుగుణంగా బస్సులెక్కడండీ?
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దూరప్రాంతాల నుంచి వచ్చేవారే కాక జిల్లానుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం పోలింగ్ జరగనున్నందున ఆదివారం రద్దీ మరింత పెరిగింది. -
పనులన్నీ పక్కన పెట్టి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టి..
[ 13-05-2024]
మనం ఒక్కరం ఓటేయకపోతే ఏమవుతుందని అనుకోలేదు.. దూరాభారమని భావించలేదు. కష్టాలను లెక్క చేయలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. -
ఓటెత్తాలి.. భవిత మారాలి
[ 13-05-2024]
ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాల్లో ఓటరు తమ హక్కు వినియోగించుకునేలా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. -
వెంకన్న సన్నిధిలో పురందేశ్వరి
[ 13-05-2024]
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, భర్త వెంకటేశ్వరరావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
మారాం చేసే వయసని మృత్యువుకేం తెలుసు..?
[ 13-05-2024]
బిస్కెట్ కావాలని.. చాక్లెట్ ఇవ్వాలని ఇంట్లో మారాం చేసే వయసున్న బాలుడు.. చిన్న చిన్న మాటలు పలుకుతూ ముద్దులొలికే చేష్ఠలతో ఇంటిల్లిపాదీని ఆనందింపజేసే చిన్నారి.. తండ్రితో బైకుపై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. -
ఎన్నికల సిబ్బందికి సదుపాయాలు కరవు
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తోన్న సిబ్బంది అక్కడ వసతులు సరిగా లేవని వాపోతున్నారు. హుకుంపేట బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ హైస్కూలు పోలింగ్ కేంద్రంలో మరుగుదొడ్లు సరిగా లేవని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటేసేందుకు.. రెక్కలు కట్టుకొని
[ 13-05-2024]
ఉత్తమ సమాజ సాకారానికి ఓటే కీలకం.. ఒక్క ఓటు చరిత్ర సృష్టిస్తుంది.. ప్రతి పౌరుడిని ఒక్క రోజు అధికారంలో ఉంచే ఏకైక ఆయుధం ఓటు. అలాంటి ఓటు వేసి రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడుకుంటామని వారంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. -
405 కేంద్రాలు సమస్యాత్మకమైనవే..
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసింది. జిల్లా పోలీస్, రెవెన్యూ, నగరపాలక, పురపాలక, పంచాయితీ శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్