వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు.
యువత, ఉద్యోగ, పోలీసులకు న్యాయం చేసే బాధ్యత మాది
కిర్లంపూడి వారాహి విజయభేరి సభలో పవన్కల్యాణ్
ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్టుడే, కిర్లంపూడి, జగ్గంపేట, గ్రామీణం: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. పొరపాటున వైకాపాకు ఓట్లేస్తే మీకున్న ఆస్తుల దస్త్రాలన్నీ డిజిటలైజ్ చేసి దోచేస్తారని.. మీకు తెలియకుండా తాకట్టు పెట్టేస్తారని హెచ్చరించారు. కిర్లంపూడిలో ఆదివారం వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా గంజాయికి అలవాటు చేశారని మండిపడ్డారు. వారాంతపు సెలవులు ఇవ్వకుండా రేయింబవళ్లు ఊడిగం చేయించుకుంటున్న ఉద్యోగులు, పోలీసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీపీఎస్ సమస్యను ఏడాదిలో పరిష్కరించేలా ఇప్పటికే చంద్రబాబుతో చర్చించానని.. 30న విడుదల చేసే కూటమి మేనిఫెస్టోలో దీనిపై స్పష్టత ఇస్తామన్నారు.
అది ధైర్యజ్యోతి
‘నేనొస్తే.. అరచేతిలో హారతులు వెలిగిస్తారు. అది మీ గుండెల్లోని ధైర్యజ్యోతి. జగన్లాంటి నీచ ప్రభుత్వానికి ఎదురుతిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి’ అని పవన్ అన్నారు. అన్యాయం చేసేవారిపై ఎదురు తిరగాలని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తెదేపా ప్రభుత్వంతో పోల్చితే జగన్ హయాంలో తక్కువ మంది ప్రయోజనం పొందారని, అంబేడ్కర్ విదేశీ విద్య విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితమని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక తండాల్లో ఉంటేనే పథకం వర్తిస్తుందని మెలిక పెట్టారని పవన్ విమర్శించారు.
తంగెళ్లకు పవన్ స్వీట్ వార్నింగ్..
తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ టీటైం ప్రారంభించి 24వేల మందికి ఉపాధి కల్పించి సంపద సృష్టించిన వ్యక్తి.. దాంట్లో 11వేల మంది మహిళలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా పెట్టా.. అని పవన్కల్యాణ్ అన్నారు. వైకాపా నాయకుల్లా.. మా అన్నదమ్ములకు, ఆడపిల్లలకు ఏమాత్రం అన్యాయం చేసినా జగన్ను చీల్చిచెండాడినట్లే.. నిన్నూ చీల్చిచెండాడుతా. నాతో సహా అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎవ్వరూ అతీతులు కాదని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. సభల్లో కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్, తోట నవీన్, అలమండ చలమయ్య, ఎం.నారాయణస్వామి, బి.గోపి.. జనసేన నాయకులు తుమ్మల రామస్వామి, వరుపుల తమ్మయ్యబాబు, మేడిశెట్టి సూర్యకిరణ్, పెంటకోట మోహన్.. భాజపా నాయకులు ఎస్.సత్తిరాజు, ఉమ్మిడి వెంకట్రావు, కూరాకుల రాజా, తదితరులు పాల్గొన్నారు.
- ఏలేరు ప్రాజెక్టుతో పూర్తిమేలు జరగాలంటే పోలవరం వాడుకలోకి రావాలన్నారు. అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీ¨న్లు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.
- దశదిశా మార్చే ఎన్నికలు 13-14 రోజులు ఉన్నాయి. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నానని, మీ బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సరైన సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా అంతా చితికిపోయారని పవన్కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
[ 14-05-2024]
జనసేన అధినేత, కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్కు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. -
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
[ 14-05-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిఠాపురం వైకాపా అభ్యర్థిని వంగా గీతను ఓటర్లు నిలదీశారు. -
ఓటరు.. చైతన్యం సూపర్
[ 14-05-2024]
సార్వత్రిక సమరం ఓటర్లలో చైతన్యం నింపింది. వజ్రాయుధాన్ని సంధించడానికి ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచే బారులు తీరారు. -
ఓటేశారు..
[ 14-05-2024]
విదేశాల నుంచి వచ్చారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేశారు. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఉత్సాహంగా తరలివచ్చారు. -
ధీమా ఇవ్వని వైఎస్సార్ బీమా
[ 14-05-2024]
వైఎస్సార్ బీమా పథకంతో బాధిత కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. -
బూత్ మారడంతో ఓటింగ్కు దూరం
[ 14-05-2024]
సీతానగరం మండలం ముగ్గళ్లలో 35వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. -
సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి: పురందేశ్వరి
[ 14-05-2024]
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బస్సులు లేవు.. రైళ్లు రద్దీ
[ 14-05-2024]
వారంతా ఓటు వేయాలనే సంకల్పంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. -
బందోబస్తు ఉన్నా ఉద్రిక్త ఘటనలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నా.. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఐడీ కార్డు లేకుండా ప్రచారమా?
[ 14-05-2024]
పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వద్ద ఉన్న 196,197,198 పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక సచివాలయ కార్యదర్శి వై.వి.వి.దుర్గాప్రసాద్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రంగాపురంలో రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
[ 14-05-2024]
పోలింగ్ చివరి క్షణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. -
కృష్ణునిపాలెంలో ఉద్రిక్తత
[ 14-05-2024]
వైకాపా, తెదేపా వర్గీయుల కవ్వింపు చర్యలు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. -
పోలింగ్ ఏజెంట్గా జడ్పీ ఉపాధ్యక్షురాలు
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షురాలు పోశిన శ్రీలేఖ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్లు కరవు
[ 14-05-2024]
వైకాపా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి అల్లవరం, గోడితిప్ప, మొగళ్లమూరు, తూర్పులంక, తదితర కేంద్రాల్లో కనిపించింది.