సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది.
కూటమి యువకుడికి నిరాకరణ
ప్రశ్నించినందుకు జనసేన బూత్ ఏజెంట్పై ఫిర్యాదు
రావిమెట్లలో ఉద్రిక్త పరిస్థితి
నిడదవోలు: ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. సమయం మించిపోయినా సరే వైకాపా అనుకూల వ్యక్తిని అనుమతించి, జనసేన అనుకూలమైన వ్యక్తిని అనుమతించకపోవడం నిడదవోలు మండలం రావిమెట్లలో ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీకి చెందిన ఒకరు ఓటేసేందుకు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావిమెట్లలోని పోలింగ్ కేంద్రానికి రాగా అనుమతించారు. ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన మరొకరు రాగా సమయం అయిపోయిందని అనుమతించలేదు. దీనిపై జనసేన పార్టీ బూత్ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ వ్యక్తికి అవకాశం ఇచ్చి, తమ మనిషిని ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జనసేన పార్టీ బూత్ ఏజెంట్పై వైకాపా నాయకులతో వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాస్నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఘటనకు సంబంధించి సమిశ్రగూడెం ఎస్సై రమేశ్ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అక్కడకు వెళ్లారు. ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అపురూప వారధులకు ఆదరణ కరవు
[ 23-05-2024]
గోదావరి జిల్లాల సస్యశ్యామల సాకారానికి సారథులీ అద్భుత వారధులు. ఆనాటి, ఈనాటి సాంకేతికతకు సజీవ సాక్ష్యాలు సేతువులు. గోదావరి నడుమ ఒయ్యారాలు ఒలికిస్తూ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందాయి. -
ఈ ‘బాదుడు’ పేరేమి!
[ 23-05-2024]
రాజమహేంద్రవరం పేపర్మిల్లు ప్రాంతంలోని ఓ సెలూన్ దుకాణం.. విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చి నిర్వాహకుడికి ఓ నోటీసు ఇచ్చారు. ఏమిటిదని ప్రశ్నించగా మీరు వినియోగిస్తున్న విద్యుత్తు లోడ్ పెరిగినందున రూ.2500 డిపాజిట్ రుసుము కట్టాలని సూచించారు. -
వైకాపా నేత.. ఇదేం మేత?
[ 23-05-2024]
వైకాపా ప్రభుత్వంలో సామాన్య రైతులనూ వదలడం లేదు. పొలంలో మెరక చేసుకుంటున్న కర్షకులను అధికార పార్టీ నేతకు చెందిన వ్యక్తులు వచ్చి మైనింగ్ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేసిన వైనమిది. -
ఉచిత విద్య.. అంతా మిథ్య
[ 23-05-2024]
రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీనివాసరావు చిరుద్యోగి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో 25 శాతం రాయితీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తెకు సీటు వచ్చింది. ఆనందంతో వెళ్లి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాడు. -
బహిరంగ మార్కెట్కు తరలిన ధాన్యం
[ 23-05-2024]
జిల్లాలో రబీ సీజన్లో పండిన ధాన్యం బహిరంగ మార్కెట్కు తరలిపోయింది. ఎన్నికల వేళ కావడంతో పౌరసరఫరాల సంస్థకు ధాన్యాన్ని విక్రయిస్తే.. డబ్బులు త్వరగా వస్తాయో.. రావోనని.. భావించిన రైతులు పండిన ధాన్యాన్ని మిల్లర్లు, మధ్యవర్తులకు అమ్మేశారు. -
అనిశా వలలో అవినీతి తిమింగలం
[ 23-05-2024]
అవినీతి నిరోధకశాఖ వలలో తిమింగలం చిక్కింది.. ఐస్ ఫ్యాక్టరీ రాయితీ సొమ్ము మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన కాకినాడ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.మురళి, రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. -
ఐసీయూల్లో ఉక్కబోత
[ 23-05-2024]
కాకినాడ జీజీహెచ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి ఏఎంసీయూ, ఎస్ఐసీయూ, ఆర్ఐసీయూ, ఆర్థో, గైనిక్, ఎమర్జన్సీ, -
ఈ ఏడాదీ అత్తెసరు వసతులేనా..!
[ 23-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా మార్పు చేసి అక్కడే ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. -
హతవిధీ..నీరు ఎలా పారేది
[ 23-05-2024]
పంట కాలువల నిర్వహణ, దాని స్థితిగతులను జలవనరుల శాఖ పూర్తిగా వదిలేయడంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. వీటికన్నా మురుగునీటి కాలువలు ఎంతో నయమనిపిస్తున్నాయి. క్లోజర్ పిరియడ్లోనూ వీటికి ఏవిధమైన పనులు చేపట్టకపోవడం, -
కృష్ణబాబుకు కన్నీటి వీడ్కోలు
[ 23-05-2024]
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొమ్మేరులోని దివాణం వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున వచ్చి కృష్ణబాబు భౌతికకాయానికి నివాళి అర్పించారు. -
రైలులో సైకో వీరంగం
[ 23-05-2024]
మసీదుసెంటర్: రైలులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రయాణికులు అతికష్టం మీద అతడిని పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. -
నన్ను జైల్లోనే చంపాలని చూశారు
[ 23-05-2024]
జగన్మోహన్రెడ్డి చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించుకొన్నారు. -
కనుల వైభవం.. సత్యదేవుని విహారం
[ 23-05-2024]
జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ నడుమ అన్నవరంలో రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు 34.1 అడుగుల ఎత్తైన నూతన రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు బుధవారం ఆశీనులు కాగా భక్తులు దర్శించుకుని పరవశించారు. -
తిరు కల్యాణం.. తరించిన భక్తజనం!
[ 23-05-2024]
ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ తూర్పు వైపున అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై పద్మావతి, -
పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
[ 23-05-2024]
పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) జి.నరసింహులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఆరోగ్యశ్రీ సేవలపై సందిగ్ధం
[ 23-05-2024]
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు
-
మా స్పెషాలిటీ చూపించలేకపోయాం.. ‘ఇంపాక్ట్’ రూల్తో ఆ స్కోరు సరిపోదు: డుప్లెసిస్
-
నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ
-
మహిళ కిడ్నీలో 77 రాళ్లు
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,599
-
ఇంకెన్ని వెబ్సిరీస్లు విడుదల అవుతాయో..! పిన్నెల్లిపై పేలుతున్న ట్రోల్స్